రాష్ట్రంలో కోవిద్ కేసులు పెరిగిన నేపథ్యంలో చర్యలు ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. 1 నుంచి 9 తరగతుల వరకు ఎలాంటి పరీక్షలు ఉండవని పేర్కొంది. అలాగే.. ఇంటర్, పదో తరగతి పరీక్షలు యధాతథంగా జరుగతాయని ప్రకటించింది. పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో నేడు సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ భేటీలో వైద్య ఆరోగ్య, హోంశాఖ, విద్యాశాఖ మంత్రులతో పాటు ఉన్నతాధికారులతో సీఎం వైఎస్ జగన్ మాట్లాడనున్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలు మూసివేసిన విషయం తెలిసిందే. టెన్త్, ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు కూడా రద్దయ్యాయి. ఇంటర్ సెకండియర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. మరికొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ విధిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలోనూ స్కూళ్ల మూసివేత, టెన్త్, ఇంటర్ పరీక్షలపైనా కీలక నిర్ణయం తీసుకున్నారు.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా సీబీఎస్ఈ టెన్త్, ఇంటర్ (12వ తరగతి) పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకుంది. పదవ తరగతి పరీక్షలను రద్దు చేసిన కేంద్రం.. 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. కరోనా వ్యాప్తిని బట్టి పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని తాజాగా ప్రకటించింది.
కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలు మూసివేసిన విషయం తెలిసిందే. టెన్త్, ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు కూడా రద్దయ్యాయి. ఇంటర్ సెకండియర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. మరికొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ విధిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలోనూ స్కూళ్ల మూసివేత, టెన్త్, ఇంటర్ పరీక్షలపైనా కీలక నిర్ణయం తీసుకున్నారు.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా సీబీఎస్ఈ టెన్త్, ఇంటర్ (12వ తరగతి) పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకుంది. పదవ తరగతి పరీక్షలను రద్దు చేసిన కేంద్రం.. 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. కరోనా వ్యాప్తిని బట్టి పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని తాజాగా ప్రకటించింది.