యాప్నగరం

క్లాస్‌ రూమ్‌లో బల్లలపై విద్యార్థుల పేర్లు.. పేరున్న చోటే కూర్చునేలా ఏర్పాట్లు..!

స్కూళ్లు, కాలేజీల పునఃప్రారంభంపై ఎన్‌సీఈఆర్‌టీ, ఎంహెచ్‌ఆర్డీ కసరత్తు ప్రారంభించాయి. ఈ మేరకు ముసాదాను రూపొందించాయి.

Samayam Telugu 15 Jun 2020, 2:50 pm
లాక్‌డౌన్‌ సడలింపుతో స్కూళ్లు, కాలేజీల పునఃప్రారంభంపై ఎన్‌సీఈఆర్‌టీ, ఎంహెచ్‌ఆర్డీ కసరత్తు ప్రారంభించాయి. ఈ మేరకు పాఠశాలల పునఃప్రారంభంపై జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) ముసాయిదా నివేదిక రూపొందించింది.
Samayam Telugu స్కూళ్ల పునఃప్రారంభం


కరోనా నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్య భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సిఫారసులు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన అనంతరం వాటిని అన్నీ రాష్ట్రాలకు పంపిస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని పరిశీలించి స్థానిక పరిస్థితులను బట్టి మార్పులు చేసుకోవచ్చు.

Also read: టీఎస్‌ ఇంటర్ ఫలితాలపై నేడు స్పష్టత..?

ఎన్‌సీఈఆర్‌టీ ప్రధాన ప్రతిపాదనలు:
  • షిఫ్టు విధానంలో తరగతులు నడపాలి.
  • బల్లపై విద్యార్థుల పేర్లు రాయాలి. వారి పేర్లున్న చోటే విద్యార్థులు కూర్చోవాలి.
  • ఇంటర్వెల్‌ను ఒక్కో తరగతికి వేర్వేరుగా ఇవ్వాలి. ఒక్కో ఇంటర్వెల్‌ మధ్య 10-15 నిమిషాల వ్యవధి ఉండాలి.
  • ఏసీ తరగతి గదులు ఉండటానికి వీల్లేదు. తరగతి గదుల్లో కిటికీలు ఎప్పుడూ తెరిచే ఉంచాలి.
  • విడతల వారీగా తరగతులు ప్రారంభించాలి. మొదట ఇంటర్‌, వారం తరువాత 9, 10 తరగతులు, మరో రెండు వారాల అనంతరం 6, 7, 8 తరగతులు, మరో మూడు వారాల అనంతరం 3, 4, 5 తరగతులు, నాలుగు వారాల తరువాత 1, 2 తరగతులు మొదలుపెట్టాలి.
  • తల్లిదండ్రుల అంగీకారంతో చివర్లో నర్సరీ తరగతులను ప్రారంభించాలి.
  • బడుల వద్ద తినుబండారాల విక్రయాలు నిషేధించాలి.
  • స్కూల్‌ క్యాంపస్‌లో ఆరుబయట స్థలంలోనూ తరగతులు నిర్వహించుకోవచ్చు.
  • హాస్టళ్లు ఉంటే విడతల వారీగా విద్యార్థులను రప్పించాలి.
  • ఒక్కో విద్యార్థి మధ్య 6 అడుగుల దూరం ఉండేలా ఏర్పాట్లు చేయాలి.
Also read: ఏపీ టెన్త్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ప్రశ్నల సంఖ్య 360 నుంచి 197కి తగ్గింపు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.