యాప్నగరం

ఐఐటీ- జేఈఈ అడ్వాన్స్‌డ్ ఆన్‌లైన్‌ తరహాలోనే!

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ప్రవేశ పరీక్షలు ఇక నుంచి పూర్తిగా ఆన్ లైన్ విధానంలోనే నిర్వహించనున్నారు.

TNN 21 Aug 2017, 7:22 pm
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ప్రవేశ పరీక్షలు ఇక నుంచి పూర్తిగా ఆన్ లైన్ విధానంలోనే నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుంది. ఈ మేరకు జాయింట్ అడ్మిషన్ బోర్డు (జేఏబీ) నిర్ణయం తీసుకున్నట్టు జేఏబీ-2017 చైర్మన్, ఐఐటీ-మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ భాస్కర రామమూర్తి తెలియజేశారు. 2018 నుంచి జేఈఈ (అడ్వాన్స్ డ్) పరీక్షలు ఆన్ లైన్ లోనే నిర్వహించాలని నిర్ణయించామని, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం సులువుగా ఉండాలన్న ఉద్దేశంతోనే జేఈఈ (అడ్వాన్స్ డ్)ని ఆన్ లైన్‌లో నిర్వహించనున్నట్టు జేఏబీ సభ్యుల్లో ఒకరు చెప్పారు.
Samayam Telugu iit entrance exam to go completely online from 2018
ఐఐటీ- జేఈఈ అడ్వాన్స్‌డ్ ఆన్‌లైన్‌ తరహాలోనే!


ఈ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు తగిన సౌకర్యాలు కల్పించాల్సి అవసరం ఉందని, ఇకపై పెన్ను-పేపర్ విధానానికి స్వస్తి చెప్పి, కంప్యూటర్ ద్వారానే వీటిని నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ విధానాన్ని అవలంబించడం వల్ల ఫలితాలు వేగంగా వెల్లడించడం, మూల్యాంకనం సక్రమంగా జరగడం, ప్రశ్నాపత్రాల ముద్రణలో దోషాలు దొర్లకుండా చూడటం, ప్రశ్నాపత్రాల లీకేజ్ నిరోధించడం లాంటి ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు.

ఈ ఏడాది నిర్వహించిన ఐఐటీ జేఈఈ ప్రశ్నాపత్రంలో తప్పులు దొర్లడం వల్ల మద్రాస్ ఐఐటీ 18 మార్కులను బోనస్‌గా ఇవ్వాల్సి వచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ ఓ విద్యార్థి సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించాడు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని సుప్రీంకోర్టుకు మద్రాస్ ఐఐటీ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో జాయింట్ అడ్మిషన్ బోర్డ్ తాజా నిర్ణయం తీసుకుంది. అయితే జేఈఈ -మెయిన్స్ మాత్రం పెన్ను-పేపర్ లేదా కంప్యూటర్)లోనే జరగనుంది. అంటే, పెన్ను-పేపర్ లేదా కంప్యూటర్ లో ఏదో ఒక విధానాన్ని విద్యార్థులు ఎంపిక చేసుకోవచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.