తెలంగాణలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. హైకోర్టు తీర్పు నేపథ్యంలో మే 25 నుంచి జరగాల్సిన ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను ఇంటర్ బోర్డు వాయిదా వేసింది. జూన్ 7 నుంచి పరీక్షలకు నిర్వహించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు పరీక్షల రీషెడ్యూలును విడుదల చేసింది. మారిన షెడ్యూలు ప్రకారం జూన్ 7 నుంచి 14 వరకు సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 గం. నుంచి 12 గం. వరకు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటలకు వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అదేవిధంగా.. జూన్ 15 నుంచి 18 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గం. - మ.12.00 గం. వరకు, మధ్యాహ్నం జూన్ 19న ఎథిక్స్ & హ్యూమన్ వ్యాల్యూస్; జూన్ 20 ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష నిర్వహించనున్నారు.
వాస్తవానికి మొదట ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 16న పరీక్షలు జరగాల్సి ఉండగా.. మే 25 కి వాయిదా వేశారు. అయితే ఒకవైపు ఇంటర్ రీవాల్యుయేషన్, రీవెరిఫికేషన్ ఫలితాలను మే 27న విడుదల చేయాలంటూ హైకోర్టు ఆదేశాలివ్వడం.. మరోవైపు మే 26, 27 తేదీల్లో బిట్శాట్, జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల కారణంగా.. సప్లిమెంటరీ పరీక్షలను వాయిదా వేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు.. సప్లిమెంటరీ పరీక్షలను ఇంటర్ బోర్డు మరోసారి వాయిదా వేయక తప్పలేదు.
వాస్తవానికి మొదట ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 16న పరీక్షలు జరగాల్సి ఉండగా.. మే 25 కి వాయిదా వేశారు. అయితే ఒకవైపు ఇంటర్ రీవాల్యుయేషన్, రీవెరిఫికేషన్ ఫలితాలను మే 27న విడుదల చేయాలంటూ హైకోర్టు ఆదేశాలివ్వడం.. మరోవైపు మే 26, 27 తేదీల్లో బిట్శాట్, జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల కారణంగా.. సప్లిమెంటరీ పరీక్షలను వాయిదా వేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు.. సప్లిమెంటరీ పరీక్షలను ఇంటర్ బోర్డు మరోసారి వాయిదా వేయక తప్పలేదు.