యాప్నగరం

అమ్మ ఒడిపై తల్లిదండ్రులకు అలర్ట్‌.. వివరాలు ఓసారి చెక్‌ చేసుకోండి.. లేకపోతే వచ్చేనెల డబ్బులు రావు

జగనన్న అమ్మ ఒడి పథకానికి సంబంధించి అధికారులు కీలక ప్రకటన చేశారు.

Samayam Telugu 12 Dec 2020, 7:44 pm
ఏపీలో జగనన్న అమ్మ ఒడి పథకానికి సంబంధించి అధికారులు కీలక ప్రకటన చేశారు. 2020-21కు సంబంధించి విద్యార్థుల తల్లులు తమ వివరాలను వెబ్ పోర్టల్లో సరిచూసుకోవాలని పాఠశాల విద్యా సంచాలకుడు వాడ్రేవు చినవీరభద్రుడు తెలిపారు. అమ్మ ఒడి పథకం అమలు తీరుపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Samayam Telugu జగనన్న అమ్మ ఒడి


ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్ విద్యార్థుల వరకు.. అర్హులైన తల్లులు లేదా సంరక్షకులు తమ బ్యాంకు అకౌంట్ నంబరు, ఐఎఫ్ఎస్సీ కోడ్, రైస్ కార్డు నంబరు వంటి వివరాలను అమ్మ ఒడి వెబ్ పోర్టల్లో సరిచూసుకోవాలని కోరారు. ఒకవేళ బ్యాంకు వివరాలు, ఇతర అంశాల్లో ఏవైనా లోపాలు ఉంటే వెంటనే స్కూల్ హెడ్ మాస్టర్‌ను సంప్రదించి సరిదిద్దుకోవాలని సూచించారు.

ఇంకా అభ్యంతరాలు ఉంటే అమ్మ ఒడి వెబ్ పోర్టల్లో సరిచేసుకోవాలన్నారు. తల్లిదండ్రులు వెంటనే ఈ వివరాలు సరిచూసుకోవాలని చిన వీరభద్రుడు కోరారు. వచ్చే నెలలో అమ్మ ఒడి రెండో విడత డబ్బులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.. అందుకే అధికారులు వివరాలను చెక్ చేసుకోవలసినదిగా సమాచారం ఇచ్చారు.

ఈ ఏడాది జనవరిలో ఏపీ సీఎం జగన్ అమ్మఒడి పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం అమల్లో భాగంగా.. వచ్చే ఏడాది నుంచి 75శాతం అటెండెన్స్ తప్పనిసరిగా ఉండాలిని సీఎం తెలిపారు.. ఈ ఏడాదికి మాత్రం ఆ నిబంధన ఉండదన్నారు. మేనిఫెస్టోలో 1 నుంచి 10 తరగతి వరకే అని చెప్పాం.. కానీ 1 నుంచి ఇంటర్ వరకు అమలు చేస్తున్నామని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.