యాప్నగరం

ఇంటర్‌ పాసైతే చాలు.. అలాగే 90 ప్రశ్నల్లో 75 ప్రశ్నలకు మాత్రమే జవాబులు రాస్తే సరిపోతుంది.. కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం

NEET JEE 2021 Syllabus: జేఈఈ, నీట్‌ పరీక్షలకు కూడా పాత సిలబసే ఉంటుందని కేంద్ర విద్యాశాఖ స్పష్టం చేసింది.

Samayam Telugu 20 Jan 2021, 7:09 am
ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీల్లో బీటెక్‌ చేరాలంటే ఇంటర్మీడియట్‌లో 75 శాతం మార్కులు ఉండాలన్న నిబంధనను వచ్చే విద్యాసంవత్సరానికి (2021-22) రద్దు చేశారు. కరోనా కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది ఇంటర్‌/12వ తరగతి కనీస మార్కులతో ఉత్తీర్ణులైతే సరిపోతుంది. జేఈఈ మెయిన్‌/ అడ్వాన్స్‌డ్‌లో వచ్చిన ర్యాంకులతో ప్రవేశాలు పొందవచ్చు. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.
Samayam Telugu జేఈఈ మెయిన్‌ 2021


NEET 2021: నీట్‌ అభ్యర్థులకు లక్కీ‌ ఛాన్స్‌.. ఈసారి కొశ్చన్‌ పేపర్‌లో ఛాయిస్‌.. కేంద్ర విద్యాశాఖ నిర్ణయం
మరో కీలక నిర్ణయం:
కేంద్ర విద్యాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జేఈఈ మెయిన్‌ మాదిరిగానే ఈ ఏడాది నీట్‌ కొశ్చన్‌ పేపర్‌లోనూ ఛాయిస్‌ ఇవ్వనున్నారు. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ నిర్ణయించింది. కరోనా కారణంగా ఏర్పడిన గందరగోళ పరిస్థితుల వల్ల విద్యార్థులపై ఒత్తిడి పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే జేఈఈ తరహాలోనే నీట్‌ పరీక్షకు కూడా పాత సిలబసే ఉంటుందని స్పష్టం చేసింది.

జేఈఈ మెయిన్‌ 90 ప్రశ్నల్లో 75 ప్రశ్నలకు మాత్రమే జవాబులు గుర్తించాలని జాతీయ పరీక్ష మండలి (ఎన్‌టీఏ) కొద్దిరోజుల క్రితం నిర్ణయించిన విషయం తెలిసిందే. నీట్‌లో ప్రస్తుతం ఒక్కొ ప్రశ్నకు 4 మార్కుల చొప్పున 180 ప్రశ్నలతో 720 మార్కులకు ప్రశ్నపత్రం ఇస్తున్నారు. అంటే ఒక్కో సబ్జెక్టు నుంచి 45 ప్రశ్నలు ఉంటున్నాయి. దీన్ని 50కి పెంచే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే ఛాయిస్‌ ఇచ్చినా అందకు తగ్గట్లు కొన్ని నిబంధనలు పెట్టే అవకాశముంది.

బీటెక్‌ వాళ్లకు ఈసీఐఎల్‌-హైదరాబాద్‌లో జాబ్స్‌.. అప్లయ్‌ చేయడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి
ప్రతీ ఏడాది దేశవ్యాప్తంగా నీట్‌ పరీక్షకు దాదాపు 15 లక్షల మంది పోటీ పడుతుండగా.. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 1.20 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. నీట్‌ 2021 పరీక్ష తేదీని ఇంకా వెల్లడించలేదు. ఈ తేదీని త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.