యాప్నగరం

JEE Main answer key 2022: జేఈఈ మెయిన్స్‌ విద్యార్థులకు చేదు అనుభవం.. ఆన్సర్‌ ఇచ్చినా లెక్కలోకి తీసుకోని వైనం..? ఆందోళనలో అభ్యర్థులు

JEE Main 2022 Answer Key: ఇటీవల జరిగిన జేఈఈ మెయిన్స్‌ (JEE Main 2022) సెషన్‌ 1 పరీక్ష గతంలో ఎప్పుడూ లేనంతగా సమస్యలు సృష్టిస్తోంది. పరీక్ష రోజు గంటల తరబడి ఆలస్యం కాగా.. తాజాగా..

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 5 Jul 2022, 2:16 pm
JEE Main 2022 Answer Key: ఇటీవల జరిగిన జేఈఈ మెయిన్స్‌ (JEE Main 2022) సెషన్‌ 1 పరీక్ష గతంలో ఎప్పుడూ లేనంతగా సమస్యలు సృష్టిస్తోంది. పరీక్ష రోజు గంటల తరబడి ఆలస్యం కాగా.. ఇప్పు డు సమాధానం ఇచ్చిన ప్రశ్నలను కంప్యూటర్‌ లెక్కలోకి తీసుకోని చేదు అనుభవం అభ్యర్థులు చవిచూస్తున్నారు. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) దేశవ్యాప్తంగా నిర్వ హించిన ఈ పరీక్షలో లోపాలను సరిదిద్దే వారే లేరని విద్యార్థులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు.
Samayam Telugu JEE Main answer key 2022


ఇటీవల మొదటి సెషన్‌ పేపర్‌-1 పరీక్ష ప్రాథమిక కీను విడుదల చేయడమే కాకుండా విద్యార్థులు ఏఏ ప్రశ్నలకు జవాబులు గుర్తించారో తెలుసుకునే రెస్పాన్స్‌ షీట్‌ల (ఓఎంఆర్‌ తరహా)ను ఎన్‌టీఏ వెబ్‌సైట్లో ఉంచింది. అయితే మొత్తం 75లో 65 ప్రశ్నలను గుర్తించగా.. రెస్పాన్‌ పత్రంలో మాత్రం 30కి మాత్రమే సమాధానాలు గుర్తించినట్లు చూపుతోందని విద్యార్థి ఒకరు తెలిపారు.

Sri city Recruitment Tirupati 2022: తిరుపతి జిల్లా శ్రీ సిటీలో 400 ఉద్యోగాలు.. ఏడాదికి రూ.3.02 లక్షల వరకు జీతం.. మహిళలు కూడా అర్హులే.. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక
ఇలా తెలిపిన వారిలో ఎక్కువ మంది జూన్‌ 24వ తేదీన ఉదయం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఇంజినీరింగ్‌ కాలేజీల్లో పరీక్ష రాసిన వారు కావడం గమనార్హం. అదేవిధంగా అబిడ్స్‌లోని అరోరా ఇంజినీరింగ్‌ కాలేజీలో జూన్‌ 24 సాయంత్రం పరీక్షను రద్దు చేసి అదే నెల 30 న జరిపారు. అందులో 53 ప్రశ్నలను గుర్తించగా.. 33 మాత్రమే చూపుతోందని మరో విద్యార్థి పేర్కొన్నారు. ఇలాగైతే తమ పిల్లలు నష్టపోతారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతున్నారు. మరి NTA ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం.

JEE Main Session 1 Result 2022: ఇక జేఈఈ మెయిన్‌ సెషన్‌ 1 ఫలితాలు ఈ వారంలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ పరీక్షకు హాజరైన విద్యార్థులు https://jeemain.nta.nic.in/ వెబ్‌సైట్‌ ద్వారా ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు.
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.