యాప్నగరం

JEE Main 2023 Result : ఈనెల 29న జేఈఈ మెయిన్‌ ఫలితాలు.. పూర్తి వివరాలివే

JEE Main Result 2023 : ఏప్రిల్‌ 6 నుంచి ప్రారంభమైన చివరి విడత జేఈఈ మెయిన్‌ 2వ విడత పరీక్షలు శనివారం (ఏప్రిల్‌ 15)తో ముగియనున్నాయి. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాల విషయానికొస్తే..

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 15 Apr 2023, 1:09 pm
JEE Main 2023 Result Date : జేఈఈ మెయిన్‌ ఫలితాలు (JEE Main 2023 Result) ఏప్రిల్‌ 29వ తేదీన విడుదల కానున్నాయి. ఏప్రిల్‌ 6 నుంచి ప్రారంభమైన చివరి విడత మెయిన్‌ పరీక్షలు శనివారం (ఏప్రిల్‌ 15)తో ముగియనున్నాయి. జనవరిలో జరిగిన తొలి విడత మెయిన్, తాజా పరీక్షల్లో సాధించిన ఉత్తమ స్కోర్‌ను (రెండు సార్లు రాసి ఉంటే) పరిగణనలోకి తీసుకొని జాతీయ పరీక్షల మండలి (NTA) ర్యాంకులు కేటాయించనుంది. జేఈఈ మెయిన్‌లో కేటగిరీల వారీగా కటాఫ్‌ మార్కులు నిర్ణయించి మొత్తం 2.50 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాయడానికి అర్హత కల్పిస్తారు.
Samayam Telugu JEE Main 2023 Result


జూన్‌ 4వ తేదీన జరిగే JEE Advance 2023 పరీక్ష రాయడానికి ఏప్రిల్‌ 30వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మొదలవుతుందని ఐఐటీ గువాహటి ఇప్పటికే ప్రకటించింది. ప్రతి సంవత్సరం మెయిన్‌ ర్యాంకులు వచ్చిన మరుసటి రోజు నుంచే అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు దరఖాస్తుల సమర్పణ ప్రక్రియను ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈమేరకు ఈసారి ఏప్రిల్‌ 29న జేఈఈ మెయిన్‌ పేపర్‌-1 (బీటెక్‌లో ప్రవేశం కోసం నిర్వహించిన) ర్యాంకులు విడుదలవుతాయని తెలుస్తోంది. జనవరిలో జరిగిన తొలివిడత జేఈఈ మెయిన్‌కు 8.60 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నా వారిలో 8.24 లక్షల మంది హాజరయ్యారు. చివరి విడతకు 9.40 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులు ఫలితాల కోసం https://jeemain.nta.nic.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.