యాప్నగరం

వెబ్‌సైట్‌లో జేఈఈ మెయిన్-2018 హాల్‌టికెట్లు..!

ఐఐటీ, ఎన్‌ఐటీ, ఇతన కేంద్రీయ విద్యాసంస్థల్లో... సీట్ల భర్తీకి ఏప్రిల్ 8న జేఈఈ మెయిన్ ఆఫ్‌లైన్ (పేపర్, పెన్) రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఏప్రిల్ 15, 16 తేదీల్లో ఆన్‌లైన్ పరీక్ష నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు.

TNN 27 Mar 2018, 10:00 am
ఐఐటీ, ఎన్‌ఐటీ, ఇతన కేంద్రీయ విద్యాసంస్థల్లో... సీట్ల భర్తీకి ఏప్రిల్ 8న జేఈఈ మెయిన్ ఆఫ్‌లైన్ (పేపర్, పెన్) రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఏప్రిల్ 15, 16 తేదీల్లో ఆన్‌లైన్ పరీక్ష నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు. వీటికి దేశవ్యాప్తంగా దాదాపు 13.50 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 1.25 లక్షల మంది హాజరుకానున్నారు. పరీక్షకు సంబంధించి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ ప్రక్రియ ప్రారంభమైంది. జేఈఈ మెయిన్ -2018 వెబ్‌సైట్ ద్వారా విద్యార్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్) యూనిట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తెలిపారు. ఏప్రిల్ 8న దేశవ్యాప్తంగా 258 నగరాల్లో జేఈఈ మెయిన్ పరీక్షను నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌లలో కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఆన్‌లైన్ పరీక్షలను హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్‌ జిల్లాల్లో నిర్వహించనున్నారు.
Samayam Telugu Jee Main


ఏప్రిల్‌ 8వ తేదీన జరగనున్న జేఈఈ మెయిన్‌కు ఈ సారి మెటల్‌ డిటెక్టర్లు వినియోగించనున్నారు. ఇప్పటివరకు విద్యార్థులను చేతులతోనే తనిఖీలు చేసేవారు. ఇకనుంచి మెటల్‌ డిటెక్టర్‌లను ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేసి వాటిద్వారా విద్యార్థులను లోపలకు అనుమతించాలని నిర్వాహకులు నిర్ణయించారు.
Download Admit Card of JEE(Main)-2018

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.