JNTUH: పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన జేఎన్టీయూ.. జులైలో బీటెక్, బీఫార్మసీ పరీక్షలు
jntuh.ac.in: హైదరాబాద్ జేఎన్టీయూ షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం.. థర్డ్, ఫైనల్ ఇయర్ మొదటి సెమిస్టర్ పరీక్షలను జులై 1 నుంచి 3 వ తేదీల్లో నిర్వహించనున్నారు.
Samayam Telugu 25 Jun 2021, 10:59 am
ప్రధానాంశాలు:
- జేఎన్టీయూహెచ్ కీలక ప్రకటన విడుదల
- బీటెక్, బీ ఫార్మసీ పరీక్షల షెడ్యూల్ వెల్లడి
- అధికారిక వెబ్సైట్లో పూర్తి వివరాలు
కరోనా వ్యాప్తి, లాక్డౌన్ నేపథ్యంలో వాయిదా పడిన పరీక్షల రీ షెడ్యూల్ను జేఎన్టీయూ విడుదల చేసింది. బీటెక్, బీ-ఫార్మసీ థర్డ్, ఫైనల్ ఇయర్ పరీక్షలు జులై నెలలో నిర్వహించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ జేఎన్టీయూ షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం.. థర్డ్, ఫైనల్ ఇయర్ మొదటి సెమిస్టర్ పరీక్షలను జులై 1 నుంచి 3 వ తేదీల్లో నిర్వహించనున్నారు. వాస్తవానికి ఈ పరీక్షలు మార్చి 25 నుంచి 27 మధ్య జరగాల్సి ఉంది. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేస్తూ జేఎన్టీయూ నిర్ణయించింది. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో పరీక్షలను మళ్లీ నిర్వహించాలని డిసైడ్ అయ్యింది. ఈ క్రమంలోనే తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది.
ఇక బీటెక్, బీఫార్మసీ ఫైనల్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ పరీక్షలను జులై 5వ తేదీ నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల షెడ్యూల్కు సంబంధించి పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ https://jntuh.ac.in/ లో పొందుపరిచామని.. విద్యార్థులు పరీక్షల షెడ్యూల్ను వెబ్సైట్లో చూసుకోవచ్చునని యూనివర్సిటీ అధికారులు తెలిపారు.
ఇక బీటెక్, బీఫార్మసీ ఫైనల్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ పరీక్షలను జులై 5వ తేదీ నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల షెడ్యూల్కు సంబంధించి పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ https://jntuh.ac.in/ లో పొందుపరిచామని.. విద్యార్థులు పరీక్షల షెడ్యూల్ను వెబ్సైట్లో చూసుకోవచ్చునని యూనివర్సిటీ అధికారులు తెలిపారు.