యాప్నగరం

JNTUH: బీటెక్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఎగ్జామ్‌ టైమింగ్స్‌ పొడిగింపు

B.Tech Exams 2021: బీటెక్ విద్యార్థులకు 2021 మార్చి, ఏప్రిల్‌లో సెమిస్టర్ పరీక్షలు జరగాల్సి ఉన్న విషయం తెలిసిందే. ఈ పరీక్షలను అదనంగా ఓ గంటపాటు రాయడానికి అనుమతి ఇచ్చింది.

Samayam Telugu 20 Feb 2021, 8:51 pm
బీటెక్‌ విద్యార్థులకు జేఎన్‌టీయూ-హైదరాబాద్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. బీటెక్ పరీక్ష టైమింగ్స్‌ని ఓ గంట పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. బీటెక్ విద్యార్థులకు 2021 మార్చి, ఏప్రిల్‌లో సెమిస్టర్ పరీక్షలు జరగాల్సి ఉన్న విషయం తెలిసిందే. ఈ పరీక్షలను అదనంగా ఓ గంటపాటు రాయడానికి అనుమతి ఇచ్చింది. అంటే ఇప్పుడు పరీక్ష సమయం మూడు గంటలు.
Samayam Telugu బీటెక్‌ పరీక్షలు 2021


కరోనా వైరస్ మహమ్మారి కారణంగా విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభం కావడంతో పరీక్ష విధానంలో మార్పులు చేసింది. పరీక్ష రాయడానికి సమయం సరిపోవట్లేదని చాలామంది విద్యార్థులు యూనివర్సిటీ అధికారులను కలవడంతో.. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల్ని గుర్తించిన యూనివర్సిటీ ఈ నిర్ణయం తీసుకుంది.

మార్చి 8 నుంచి బీటెక్ సెమిస్టర్ పరీక్షలు జరగనున్నాయి. గతేడాది అక్టోబర్, నవంబర్‌లో నిర్వహించిన పరీక్షలకు అనుసరించిన కొశ్చన్‌ పేపర్‌ విధానమే.. మార్చిలో జరిగే పరీక్షలకూ ఉంటుంది. ఇక బీటెక్ సెమిస్టర్ పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఉంటాయి. ఉదయం జరిగే పరీక్ష 9.45 గంటలకు, మధ్యాహ్నం జరిగే పరీక్ష 2.15 గంటలకు ప్రారంభంకానున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.