యాప్నగరం

TS Panchayat Secretary Notification 2018: పంచాయతీ కార్యదర్శి దరఖాస్తు గడువు పెంపు

పంచాయతీ కార్యదర్శి పోస్టుల దరఖాస్తుకు గడువును పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబరు 14 వరకు ఫీజు చెల్లించి, 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Samayam Telugu 12 Sep 2018, 7:51 am
జూనియర్ పంచాయతీ కార్యదర్శి దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది. నిజానికి ఫీజు చెల్లింపుకు మంగళవారం (సెప్టెంబరు 11) చివరి తేదీ, దరఖాస్తుకు బుధవారం (సెప్టెంబరు 12) చివరి తేదీ. అయితే.. దరఖాస్తు ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా గడువును పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఫీజు చెల్లించడానికి గడువును సెప్టెంబరు 14 వరకు, దరఖాస్తు చేసుకోవడానికి గడువును సెప్టెంబరు 15 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి జూపల్లి కృష్ణారావు సూచనలతో గడువు పొడిగిస్తూ నియామక ప్రక్రియ కమిటీ కన్వీనర్ నీతూ ప్రసాద్ మంగళవారం (సెప్టెంబరు 11) ఉత్తర్వులు జారీ చేశారు.
Samayam Telugu JPS


ఇక జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి సంబంధించి ప్టెంబ‌ర్‌ 28 జరగాల్సిన రాతపరీక్షను ప్రభుత్వం అక్టోబరు 4న నిర్వహించనుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు జనరల్ క్యాటగిరీ అభ్యర్థులు రూ.500; ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. ఆబ్జెక్టివ్ పద్ధతిలో 150 మార్కులకు రెండు పేపర్లలో రాతపరీక్ష నిర్వహించనున్నారు.
Related Article: పంచాయతీ కార్యదర్శి పోస్టుల అర్హతలు, వివరాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.