యాప్నగరం

కేయూ పీజీసెట్ - 2018 ఫలితాలు

కాకతీయ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలోని వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 29 నుంచి జూన్ 5 వరకు నిర్వహించిన కేయూ పీజీ సెట్-2018 ప్రవేశ పరీక్ష ఫలితాలను శుక్రవారం విడుదలచేశారు.

Samayam Telugu 22 Jun 2018, 9:56 pm
కాకతీయ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలోని వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన కేయూ పీజీసెట్ - 2018 ప్రవేశ పరీక్ష ఫలితాలను శుక్రవారం (జూన్ 22) విడుదలచేశారు. కేయూ వీసీ ప్రొఫెసర్ ఆర్.సాయన్న, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.పురుషోత్తం ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల్లో 88.5 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం 28 కోర్సుల్లో ప్రవేశాల కోసం కేయూ పీజీ సెట్ ప్రవేశ పరీక్షను నిర్వహించారు. మే 29 నుంచి జూన్ 5 వరకు నిర్వహించిన కేయూ పీజీ సెట్ పరీక్షలకు మొత్తం 28,354 మంది దరఖాస్తు చేసుకోగా.. 24,723 మంది పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 21,487 మంది ఉత్తీర్ణులయ్యారు.
Samayam Telugu kupgcet-results2018


పీజీ సెట్ ద్వారా కేయూ, శాతవాహన విశ్వవిద్యాలయాల్లోని పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం జూన్ 28 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టనున్నారు. కేయూ, శాతవాహన యూనివర్సిటీ, ఖమ్మంలోని పీజీ సెంటర్లలో సర్టిఫికెట్ల పరిశీలన చేయనున్నారు.

ఫలితాల కోసం క్లిక్ చేయండి...

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.