యాప్నగరం

మధ్యాహ్నా భోజనం: నేల మీదే వడ్డన

మధ్యాహ్నా భోజన పథకం అపహస్యానికి గురవుతోంది. మధ్యప్రదేశ్ లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో తినడానికి ప్లేట్లు లేక పిల్లలకు నేలమీదే భోజనం వడ్డిస్తున్నారు.

Samayam Telugu 20 Oct 2016, 4:54 pm
మధ్యాహ్నా భోజన పథకం అపహస్యానికి గురవుతోంది. మధ్యప్రదేశ్ లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో తినడానికి ప్లేట్లు లేక పిల్లలకు నేలమీదే భోజనం వడ్డిస్తున్నారు.
Samayam Telugu mid day meal students served food on the floor
మధ్యాహ్నా భోజనం: నేల మీదే వడ్డన


మధ్యప్రదేశ్ రాయ్ సెన్ జిల్లాలోని ఒబేదుల్లాగంజ్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నా భోజనాన్ని నేలమీదే వడ్డిస్తున్నారు.

తినడానికి ప్లేట్లు లేకపోవడంతో ఎవరో ఒకరిద్దరు ఇంటినుంచి తెచ్చుకున్న ప్లేట్లలో నలుగురు, ఐదుగురు తింటే...మిగతావారు ప్లేట్లు లేకుండా భోజనం, చపాతీలు నేల మీదే తింటున్నారు. నేలనే ప్లేట్లుగా చేసుకుంటున్నా పాఠశాల ఉపాధ్యాయులు, అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.

అయితే గతంలో ప్రభుత్వం ప్లేట్లు మంజూరు చేసిందని, ఇటీవల నిలిపివేయడంతో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని స్కూల్ ఇన్ ఛార్జీ ఉద్దమ్ సింగ్ సోలంకి అంటున్నారు. అయితే పాత ప్లేట్లు ఏమయ్యాయని అడిగితే మాత్రం నోరు మెదపడం లేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.