యాప్నగరం

IAS age limit: సివిల్స్ అభ్యర్థులకు శుభవార్త

ఐఏఎస్ పరీక్ష రాసే అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే వార్త అందించింది. అర్హత వయసు విషయంలో స్పష్టతనిచ్చింది.

Samayam Telugu 25 Dec 2018, 5:47 pm
సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే వార్త అందించింది. అర్హత వయసును తగ్గించనున్నారంటూ ఇటీవల వచ్చిన వార్తలను కొట్టిపారేసింది. అలాంటి నిర్ణయమేమీ తీసుకోలేదని ప్రధాన మంత్రి కార్యాలయం, పర్సనల్‌, పబ్లిక్‌ గ్రీవెన్స్‌, పింఛన్ల శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌ తెలిపారు. దీంతో పాటు నంబర్ ఆఫ్ అటెంప్ట్‌ల విషయంలోనూ ఎలాంటి మార్పులు లేవని మంగళవారం (డిసెంబర్ 25) స్పష్టం చేశారు.
Samayam Telugu civils


యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ) ఏటా సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ పరీక్షకు గరిష్ట వయసును 32 ఏళ్ల నుంచి 27 ఏళ్లకు తగ్టించాలని, కనిష్ట వయసును 21 ఏళ్లు చేయాలని ఇటీవల నీతి ఆయోగ్ తన నివేదికలో సూచించింది. నాటి నుంచి సివిల్ సర్వీసెస్ అర్హత వయసు తగ్గిస్తారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో లోక్ సభలో అడిగిన ప్రశ్నకు మంత్రి జితేంద్ర సింగ్ స్పష్టతనిచ్చారు.

‘యూపీఎస్‌సీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల గరిష్ట వయసు తగ్గింపుపై వస్తున్న వార్తల్లో నిజం లేదు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అటెంప్టుల విషయంలోనూ ఎలాంటి మార్పు లేదు’ అని మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.

సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలు రాయడానికి ప్రస్తుతం జనరల్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయసును 32 ఏళ్లుగా నిర్దేశించారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులు 6 సార్లు ఈ పరీక్షను రాయవచ్చు. ఇక ఓబీసీ అభ్యర్థులకు గరిష్ట అర్హత వయసు 35 ఏళ్లుగా ఉంది. వీళ్లు పరీక్ష రాయడానికి 9 సార్లు అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు గరిష్ట అర్హత వయసు 37 ఏళ్లుగా ఉంది. వీళ్లు ఎన్నిసార్లైనా పరీక్ష రాయవచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.