యాప్నగరం

NEET PG 2022 live updates: నీట్‌ పీజీ పరీక్షపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. పూర్తి వివరాలివే

NEET PG 2022 Live: నీట్‌ పీజీ పరీక్షను వాయిదా వేయాలంటూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఆ పిటిషన్‌లపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. పూర్తి వివరాల్లోకెళ్తే..

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 13 May 2022, 3:07 pm
NEET PG 2022 పరీక్ష వాయిదాపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షను వాయిదా వేయాలంటూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఆ పిటిషన్‌లపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా నీట్ పీజీ పరీక్షను వాయిదా వేయలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
Samayam Telugu నీట్‌ పీజీ పరీక్ష 2022


నీట్‌ పరీక్ష ఆలస్యమైతే డాక్టర్ల కొరత ఏర్పడుతుందని.. తద్వారా రోగుల సంరక్షణపై తీవ్ర ప్రభావం పడుతుందని కోర్టు అభిప్రాయపడింది. అటు పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న లక్షల మంది విద్యార్థుల జీవితాలను అయోమయంలోకి నెట్టినట్లు అవుతుందని.. గందరగోళ పరిస్థితులు నెలకొంటాయని సుప్రీంకోర్టు పేర్కొంది.

India Post GDS Recruitment 2022: పోస్ట్‌ ఆఫీసుల్లో 39576 ఉద్యోగాలు.. టెన్త్‌, డిగ్రీ పాసై ఉంటే చాలు.. రూ.30,000 వరకూ జీతం
నీట్ పీజీ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థుల్లో రెండు కేటగిరీల వారు ఉన్నారని.. ఓ వర్గం వాయిదా వేయాలని కోరుతోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కానీ పరీక్షను వాయిదా వేస్తే.. పరీక్ష కోసం సన్నద్ధమైన 2.06 లక్షల మంది విద్యార్థులున్న మరో వర్గానికి నష్టం జరుగుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. కరోనా కారణంగా పరీక్షల షెడ్యూల్ప్రభావితమైందని.. దానిని పునరుద్ధరించే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పేర్కొంది. కాగా.. నీట్‌ పీజీ పరీక్ష ఇటీవల ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మే 21న జరగనుంది.
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.