యాప్నగరం

నీట్‌లో తెలుగు విద్యార్థులకు మంచి ర్యాంకులు

సీబీఎస్‌ఈ నీట్‌ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. మొదటి 25 ర్యాంకుల్లో ముగ్గురు తెలుగు విద్యార్థులు..

TNN 23 Jun 2017, 5:43 pm
Samayam Telugu neet results 3 students from telugu states in top 25 ranks
నీట్‌లో తెలుగు విద్యార్థులకు మంచి ర్యాంకులు
సీబీఎస్‌ఈ నీట్‌ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. మొదటి 25 ర్యాంకుల్లో ముగ్గురు తెలుగు విద్యార్థులు ర్యాంకులు దక్కించుకున్నారు. తెలంగాణ నుంచి లక్కింశెట్టి అర్నవ్‌ త్రిపాఠి 12వ ర్యాంకు, మంగని దీపిక 24వ ర్యాంకు సాధించగా.. ఆంధ్రప్రదేశ్‌ నుంచి నారెడ్డి మన్విత 14వ ర్యాంకు సాధించింది. నెల్లూరుకు చెందిన ఫనిలాస్య 51వ ర్యాంకు సాధించింది. కాగా.. పంజాబ్‌కు చెందిన నవదీప్‌ సింగ్‌ 99.999908 శాతం మార్కులతో మొదటి ర్యాంకు సాధించాడు. నవదీప్‌‌కు 697 మార్కులు రాగా.. మధ్యప్రదేశ్‌కు చెందిన అర్చిత్‌ గుప్తా 695 మార్కులతో (99.999725) రెండో స్థానంలో నిలిచాడు. తెలుగు రాష్ట్రాల నుంచి నీట్ పరీక్ష రాసే విద్యార్థుల సంఖ్య గత రెండు, మూడేళ్ల నుంచే పెరుగుతోంది. సాధారణంగా ఉత్తర భారత దేశానికి చెందిన విద్యార్థులే ఈ పరీక్షలో ఎక్కువగా రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో మన విద్యార్థులు కనబరిచిన ప్రతిభ విస్మరించరానిదే.

ఈ పరీక్షలో మొత్తం 6,11,739 మంది అర్హత సాధించారు. మొత్తం మీద అబ్బాయిలే సత్తా చాటారు. తొలి పది ర్యాంకుల్లో తొమ్మిది మంది అబ్బాయిలుండగా.. ఒకే ఒక్క అమ్మాయి 8వ ర్యాంకు సాధించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.