యాప్నగరం

GITAM Group: గీతం విద్యాసంస్థల అధిపతిగా బాలకృష్ణ అల్లుడు

భరత్ అమెరికాలో ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ, 2016లో స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ, ఎంఏ ఎడ్యుకేషన్‌ పూర్తి చేశారు.

Samayam Telugu 20 Nov 2018, 12:10 pm
గీతం విశ్వవిద్యాలయ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్. ఎం. వి. వి. ఎస్ మూర్తి అకాల మరణంతో.. ఆయన మనవడు ఎం.శ్రీభరత్‌ గీతం విద్యాసంస్థల అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. గీతం సొసైటీ పాలకవర్గం నిర్ణయం మేరకు ఆయన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలోని విద్యా సంస్థలకు అధ్యక్షుడిగా భరత్ వ్యవహరించనున్నారు. భరత్ అమెరికాలో ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ, 2016లో స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ, ఎంఏ ఎడ్యుకేషన్‌ పూర్తి చేశారు. అనంతరం సినీనటుడు నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్వినిని వివాహం చేసుకున్నారు.
Samayam Telugu bharat


మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు, గీతం విశ్వవిద్యాలయ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్. ఎం. వి. వి. ఎస్ మూర్తి అమెరికాలోని అలస్కా రాష్ట్రంలో అక్టోబరు 1న జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 6వ తేదీన కాలిఫోర్నియాలో జరగనున్న గీతం పూర్వ విద్యార్థి సమావేశంలో పాల్గొనడానికి డాక్టర్. ఎం. వి. వి. ఎస్ మూర్తి గారు అమెరికా వెళ్లగా.. అక్టోబరు 1న ఆయన ప్రయాణిస్తున్న 2017 డాడ్జ్ వ్యాన్ ఎదురుగా వస్తున్న ఫోర్డ్ ట్రక్కుకు గుద్దుకోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.