యాప్నగరం

ఆ విద్యార్థిని జీతం రూ.39.5 లక్షలు!

పాట్నా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT)కి చెందిన విద్యార్థినికి ఏటా రూ.39.5 లక్షలు చెల్లించేందుకు ఓ సంస్థ ముందుకొచ్చింది.

Samayam Telugu 25 Nov 2017, 4:12 pm
పాట్నా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT)కి చెందిన విద్యార్థినికి ఏటా రూ.39.5 లక్షలు చెల్లించేందుకు ఓ సంస్థ ముందుకొచ్చింది. ఇటీవల ఎన్ఐటీలో క్యాంపస్ సెలక్షన్లు జరిగాయి. ఇందులో టాటా మోటార్స్, సామ్‌సంగ్ ఆర్ అండ్ డీ ఇనిస్టిట్యూట్ ఇండియా, హైరేడియస్, ఇండియా మార్ట్, హీరో మోటోకార్ప్, విప్రో, ఎల్ అండ్ టీ, ఐబీఎం, ఫ్యూచర్ పస్ట్‌, అమేజాన్‌తో పాటు 37 సంస్థలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఎన్ఐటీలో సైన్స్ అండ్ ఇంజినీరింగ్ చదువుతున్న మేధా కుమారి అనే విద్యార్థినికి ఏడాదికి రూ.39.5 లక్షలు చెల్లించేందుకు అడోబ్ సిస్టమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ముందుకొచ్చింది.
Samayam Telugu nit patna student medha kumari bags the highest offer of rs 39 5 lakh offer from adobe
ఆ విద్యార్థిని జీతం రూ.39.5 లక్షలు!


భారీ జీతాల ఆఫర్లో అమేజన్ రెండో స్థానంలో నిలిచింది. ఆ సంస్థ ఐదుగురు విద్యార్థులకు రూ.27.5 లక్షలు చెల్లించేందుకు ముందుకు రావడం గమనార్హం. ఎన్‌ఐటీ, పాట్న చరిత్రలో విద్యార్థులకు ఇంత భారీ ఆఫర్లు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మేధాకుమారి 2018 జూన్ నెలలో నోయిడాలోని అడోబ్ సంస్థలో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఇంప్లిమెంటేషన్ అండ్ కోడింగ్ ఆఫీసర్‌గా జాయిన్ కానుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.