యాప్నగరం

TS: స్కూళ్లు తెరిచేందుకు పర్మిషన్‌ లేదు.. పాఠశాల విద్యాశాఖ స్పష్టత

స్కూళ్ల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకోలేదని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది.

Samayam Telugu 2 Jul 2020, 12:37 pm
కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో స్కూళ్లు పునఃప్రారంభించేందుకు ఎలాంటి పర్మిషన్‌ లేదని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. పాఠశాలల పునఃప్రారంభంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపింది.
Samayam Telugu స్కూళ్లు పునఃప్రారంభం


ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ స్కూల్స్‌ తెరిచేందుకు ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులు ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది.

అదేవిధంగా పాఠశాలల్లో ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ ఇప్పటివరకు ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదని స్పష్టం చేసింది.

ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ చిత్రా రామచంద్రన్‌ బుధవారం ప్రొసీడింగ్‌ జారీచేశారు. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించిన పాఠశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ప్రొసీడింగ్‌లో పేర్కొన్నారు.

Also read: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో ఉచితంగా స్మార్ట్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.