యాప్నగరం

బ్రేకింగ్‌: పదో తరగతి పరీక్షలు రద్దు

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న నేపథ్యంలో సీబీఎస్‌ఈ కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షలపై స్పష్టమైన ప్రకటన చేసింది.

Samayam Telugu 28 Apr 2020, 6:58 pm
కరోనా మహమ్మారి కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న నేపథ్యంలో సీబీఎస్‌ఈ కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్‌లో ఉన్న టెన్త్‌ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. పెండింగ్‌లో ఉన్న సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించబోమని బోర్డు స్పష్టం చేసింది. కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో నెలకొన్న పరిస్థితిని నిశితంగా పరిశీలించిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు.
Samayam Telugu CBSE


కాగా పది, పన్నెండో తరగతి పరీక్షలను పూర్తిగా రద్దు చేస్తారని గతంలో వచ్చిన వార్తలను సీబీఎస్‌ఈ తోసిపుచ్చింది. పరీక్షలను పూర్తిగా రద్దు చేసే అంశంపై తుది నిర్ణయం తీసుకోలేదని గతంలో ప్రకటించిన సీబీఎస్‌ఈ బోర్డు తాజాగా పదో తరగతి పెండింగ్‌ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు పేర్కొంది.

సిలబస్‌ హేతుబద్ధీకరణకు చర్యలు
లాక్‌డౌన్‌ కారణంగా క్లాసులను కోల్పోయిన విద్యార్థుల కోసం సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) సిలబస్‌ను హేతుబద్ధం చేసేందుకు తాజాగా సిద్ధమైంది. 9 నుంచి 12 తరగతుల విద్యార్థుల కోసం రానున్న విద్యాసంవత్సరంలో ఈ మేరకు మార్పులు చేసే అవకాశం ఉంది. లాక్‌డౌన్‌ కారణంగా విద్యార్థులు నష్టపోయిన కాలాన్ని, పర్యవసానాలను బోర్డు అంచనా వేస్తోంది.

1–5 తరగతులకు కొత్త కేలండర్‌ను నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్‌సీఈఆర్టీ) ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విధానాన్నే పై తరగతులకు కూడా వర్తించే దిశగా చర్యలు చేపడుతోంది. 1 నుంచి 8 తరగతులకు ఎన్సీఈఆర్టీ కొత్త విద్యా సంవత్సర కేలండర్‌ ను విడుదల చేసినట్లే సీబీఎస్‌ఈ కూడా 9 నుంచి 12 తరగతుల వారికి సిలబస్‌ను హేతుబద్ధం చేసే పనిలో ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.