యాప్నగరం

అంతవరకు స్కూలు బ్యాగులు వద్దు...

స్కూలుకెళ్లే చిట్టి పిల్లలకు స్కూలు బ్యాగు మోసే బాధ లేకుండా ఉండేలా సీబీఎస్ఈ నిర్ణయం తీసుకుంది.

TNN 22 Nov 2016, 1:23 pm
స్కూలుకెళ్లే చిట్టి పిల్లలకు స్కూలు బ్యాగు మోసే బాధ లేకుండా ఉండేలా సీబీఎస్ఈ నిర్ణయం తీసుకుంది. రెండో తరగతి వరకు పుస్తకాల సంచి మోయాల్సిన అవసరం లేకుండా చూడాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) దాని అనుబంధ పాఠశాలలకు ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి ఉపేంద్ర కుష్వాహ లోక్‌సభలో ఈ విషయాన్ని తెలియజేశారు. కేవలం బ్యాగు బరువే కాదు, పుస్తకాల బరువు కూడా తగ్గేలా సీబీఎస్ఈ చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఇందుకోసం సీబీఎస్ ఈతో పాటూ జాతీయ విద్యా పరిశోధనా శిక్షణ మండలి కూడా పనిచేస్తున్నట్టు మంత్రి తెలిపారు.
Samayam Telugu no school bags till class ii says union minister
అంతవరకు స్కూలు బ్యాగులు వద్దు...


ఒకటో, రెండో తరగతి పిల్లలకు కూవలం రెండు పుస్తకాలను, మూడు నుంచి అయిదో తరగతి వరకు మూడు పుస్తకాలు పెట్టే ఆలోచనలో ఉన్నట్టు ఆయన తెలిపారు. ఇదే జరిగితే... సీబీఎస్ఈ స్కూళ్లలో చదివే పిల్లలకు బ్యాగు బరువు చాలా తగ్గుతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.