యాప్నగరం

కోల్ ఇండియాలో 265 పోస్టులకు నోటిఫికేషన్

కోల్ ఇండియాకు చెందిన మినీరత్న కంపెనీ నార్తర్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ జూనియర్ ఓవర్‌మెన్, మైనింగ్ సిర్దార్ పోస్టలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

TNN 28 Oct 2016, 5:45 pm
నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎన్‌సీఎఫ్ఎల్) జూనియర్ ఓవర్‌మెన్, మైనింగ్ సిర్దార్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా 265 పోస్టులను భర్తీ చేస్తారు. జూనియర్ ఓవర్‌మెన్ పోస్టులకు పదో తరగతి, మైనింగ్ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమాతోపాటు మైనింగ్ ఓవర్‌మెన్ సర్టిఫికెట్ ఉండాలి. మైనింగ్ సిర్దార్ పోస్టులకు పదో తరగతి, మైనింగ్ సిర్దార్ సర్టిఫికెట్ ఉండాలి. పై రెండు విభాగాలకు అదనంగా గ్యాస్ టెస్టింగ్, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ ఉండాలి. వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. దరఖాస్తులను To The General Manager (P/MP&R), Room No. 15, Personnel Department, NCL HQ, Singrauli, MP - 486889 చిరునామాకు పోస్టు ద్వారా పంపాలి. దీనికి చివరితేది నవంబరు 26. కేవలం రాత పరీక్ష ద్వారానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష అబ్జెక్టివ్ తరహాలోనే ఉంటుంది. ఇందులో 70 మార్కులు టెక్నికల్ అంశాలకు, 30 మార్కులు జనరల్ అంశాలకు సంబంధించినవి ఉంటాయి. రాత పరీక్షలో అన్ రిజర్వుడు అభ్యర్థులకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు 40 శాతం అర్హత మార్కులుగా నిర్ణయించారు.
Samayam Telugu northern coalfields limited junior overman and mining sirdar notification
కోల్ ఇండియాలో 265 పోస్టులకు నోటిఫికేషన్


NOTIFICATION
http://nclcil.in/recruitment/EMPLOYMENT%20NOTIFICATION%20IN%20ENGLISH.pdf

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.