కేంద్ర ప్రభుత్వ నియాకాలకు సంబంధించి విప్లవాత్మక సంస్కరణకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేంద్రంలోని వివిధ శాఖల్లోని ఖాళీల భర్తీ కోసం జాతీయ నియామకాల సంస్థ (నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ- ఎన్ఆర్ఏ)ని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిమండలి నిర్ణయించింది. రైల్వే, బ్యాంకింగ్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) కింద వేర్వేరుగా భర్తీచేసే ఉద్యోగాలకు ఒకే ఉమ్మడి ప్రాథమిక అర్హత పరీక్ష నిర్వహించేందుకు ఈ ఏజెన్సీని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. కార్యదర్శి స్థాయిలో ఉండే అధికారి దీనికి నేతృత్వం వహిస్తారు. అలాగే ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, ఐబీఎస్పీ సహా అనేక రిక్రూటింగ్ సంస్థల ప్రతినిధులు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఇవీ ప్రయోజనాలు:
ఏడాదికి రెండు సార్లు:
Also read: UPSC 2021 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ముఖ్యమైన పరీక్షల తేదీలు ఇవే..!
- నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ పరిధిలోకి కేంద్ర ప్రభుత్వంలోని 20 నియామక సంస్థలను తీసుకొస్తారు.
- దేశంలోని ప్రతి జిల్లాలో కనీసం ఒకటి చొప్పున సుమారు వెయ్యి పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.
- దేశంలోని ఏ సెంటర్ నుంచైనా ఈ పరీక్ష రాయొచ్చు.
- ఉమ్మడి రిజిస్ట్రేషన్ పోర్టల్ ఏర్పాటు చేస్తారు. దీనిద్వారా అభ్యర్థులు తమకు సమీపంలోని కేంద్రాలను ఎంచుకోవచ్చు.
- ఏటా రెండుసార్లు నిర్వహించే ఈ పరీక్షల్లో విద్యార్థులు సాధించే స్కోర్ మూడేళ్లు చెల్లుబాటవుతుంది.
- స్కోర్ పెంచుకోవడానికి అభ్యర్థులు మళ్లీమళ్లీ పరీక్షలు రాయొచ్చు. అత్యుత్తమ స్కోర్నే పరిగణనలో తీసుకుంటారు.
- ప్రస్తుతం 12 భాషల్లో పరీక్ష జరుగుతుంది. తర్వాత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ఉన్న భారతీయ భాషలన్నింటిలో నిర్వహిస్తారు.
- వేర్వేరు ఫీజులతో అనేకసార్లు పరీక్షలకు హాజరు కావాల్సిన అవసరం ఉండదు.
- అన్ని ప్రాథమిక పరీక్షలకూ ఒకే సిలబస్ ఉంటుంది. అభ్యర్థులు వేర్వేరుగా సన్నద్ధం కావాల్సిన అవసరం ఉండదు.
- ఒకే క్వశ్చన్ బ్యాంకు ఉంటుంది. సురక్షితమైన, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కేంద్రీయంగా సర్వర్ను నిర్వహిస్తారు.
- ఉద్యోగాల కోసం వేర్వేరు పరీక్షలు రాయాల్సిన అవసరం ఉండదు. విలువైన సమయం, ఇతర వనరులు ఆదా అవుతాయి. పారదర్శకత పెరుగుతుంది.
ఏడాదికి రెండు సార్లు:
- డిగ్రీ, ఇంటర్ (క్లాస్-12), పదో తరగతి ఉత్తీర్ణులైన వారు ఈ సెట్ (కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్) రాయవచ్చు.
- పదో తరగతి, ఇంటర్మీడియెట్, డిగ్రీ అర్హతల ప్రకారం పరీక్షలు నిర్వహిస్తారు.
- పోస్టులను బట్టి ఒక్కో స్థాయి వారికీ ఒక్కో పరీక్ష విడివిడిగా ఉంటుంది.
- ఈ పరీక్ష ఆన్లైన్లో ఏటా రెండుమార్లు నిర్వహిస్తారు.
- గరిష్ఠ వయోపరిమితి లోపు ఎన్నిసార్లయినా అభ్యర్థులు వీటిని రాయవచ్చు.
- ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు వయోపరిమితిలో నిబంధనల మేరకు సడలింపు ఇస్తారు.
- అభ్యర్థుల స్కోర్లు ప్రభుత్వ, ప్రభుత్వరంగ, ప్రైవేటు సంస్థలకు అందుబాటులో ఉంటాయి. వీటి ఆధారంగా అవి నియామకాలు చేపట్టవచ్చు.
- సెట్ స్కోరు తరువాత రెండో, మూడో దశల పరీక్షలను- అంటే మౌఖిక, ఇతరత్రా పరీక్షలను సంబంధిత రిక్రూటింగ్ సంస్థలు నిర్వహిస్తాయి.
- సెట్ స్కోరును కావలిస్తే రాష్ట్రాల్లోని నియామక సంస్థలు, ప్రైవేటు సంస్థలు కూడా వినియోగించుకోవచ్చు
- రెండో దశ పరీక్ష అవసరం లేకుండా మొదటి దశలోని స్కోరు, వైద్య పరీక్షల ఆధారంగానే నియామకాలు చేసుకుంటామని కొన్ని సంస్థలు సూచనప్రాయంగా చెప్పడం అభ్యర్థులకు మరింత ఊరటగా ప్రభుత్వం పేర్కొంది.
Also read: UPSC 2021 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ముఖ్యమైన పరీక్షల తేదీలు ఇవే..!