యాప్నగరం

NEET 2020: నీట్‌ పరీక్షలపై ఎన్‌టీఏ కీలక ప్రకటన..!

నీట్‌ 2020 పరీక్షలపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఎన్‌టీఏ స్పందించింది.

Samayam Telugu 17 Jun 2020, 8:48 pm
కరోనా నేపథ్యంలో పలు ప్రవేశ పరీక్షలు రద్దయ్యాయి. ఈ క్రమంలో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్)‌ 2020 పరీక్షలు రద్దవుతాయని వార్తలు పుట్టుకొచ్చాయి. ఈ విషయంపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) స్పష్టత ఇచ్చింది. వైద్య విద్య ప్రవేశాల కోసం నీట్‌ పరీక్షలను ఎన్‌టీఏ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
Samayam Telugu NEET 2020


నీట్‌ పరీక్షలు రద్దు అవాస్తమని తెలిపింది. నీట్‌ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు సోషల్‌ మీడియాలో వస్తున్న నిరాధార వార్తలను నమ్మవద్దని ఓ ప్రకటన విడుదల చేసింది. 2020, జులై 26న నీట్‌ పరీక్ష ఉంటుందని గతంలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే.

Also read: ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

నీట్‌ పరీక్ష వాయిదా వేస్తున్నట్లు ఇటీవల సోషల్‌ మీడియాలో వార్తలు వైరల్‌ అయ్యాయి. దీంతో విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందారు.
విద్యార్థులు, తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించే నిరాధార వార్తలపై విచారణ జరుపుతామని ఎన్‌టీఏ స్పష్టం చేసింది.

నీట్‌ పరీక్షలకు సంబంధించి మే 11, 2020న విడుదల చేసిన ప్రకటన ప్రామాణికమని ఎన్‌టీఏ తెలిపింది. సరైన సమాచారం కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు https://nta.ac.in/ ఎన్‌టీఏ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని తెలిపింది.

Also read: నెలాఖరుకు మార్కెట్లోకి పాఠ్య పుస్తకాలు.. గతేడాది రేట్లే ఈ ఏడాది కూడా..?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.