యాప్నగరం

ఓపెన్ స్కూలు విద్యార్థులూ 'నీట్‌' రాయొచ్చు..!

ఓపెన్ స్కూలు విద్యార్థులకు కూడా 'నీట్‌' రాసే అవకాశం రానుంది. ఢిల్లీ హైకోర్టు సూచనల మేరకు వారు కూడా 'నీట్'కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత పొందారు. దీంతో ప్రయివేటు అభ్యర్థులు కూడా ఎంబీబీస్/ బీడీఎస్ చేయడానికి అవకాశం ఏర్పడినట్లయింది.

TNN 5 Mar 2018, 5:14 pm
ఓపెన్ స్కూలు విద్యార్థులకు కూడా 'నీట్' రాసే అవకాశం రానుంది. ఢిల్లీ హైకోర్టు సూచనల మేరకు వారు కూడా 'నీట్'కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత పొందారు. దీంతో ప్రయివేటు అభ్యర్థులు కూడా ఎంబీబీస్/ బీడీఎస్ చేయడానికి అవకాశం ఏర్పడినట్లయింది. కోర్టు సూచనల మేరకు నీట్కు దరఖాస్తు చేసుకునే ఓపెన్ స్కూల్ విద్యార్థుల వయసు జనరల్ విభాగానికి చెందినవారైతే 25 సంవత్సరాలు; ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విభాగానికి చెందినవారైతే 30 సంవత్సరాలు పైబడి ఉండాలి.
Samayam Telugu open-school


దరఖాస్తు సమయంలో విద్యార్థులు తమ స్కూల్ లేదా కళాశాలకు సంబంధించిన పూర్తి వివరాలు నమోదుచేయాల్సి ఉంటుంది. కోర్టు ఆదేశాల మేరకు సరైన అర్హతలు ఉన్నవారు చివరితేదీలోపు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్లో బయాలజీ అదనపు సబ్జెక్టుగా ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

గత ఫిబ్రవరి 28న... నీట్-2018 ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను నిలిపివేయమని.. ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, చంద్రశేఖర్లతో కూడిన బెంచ్ నీట్ అర్హతపై నమోదైన పిటిషన్ల విచారణకు సంబంధించి నీట్ దరఖాస్తు ప్రక్రియను నిలిపేయాలని ఈ ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. తాజా ఉత్తర్వుల ప్రకారం ఓపెన్ స్కూల్ విద్యార్థులు కూడా నీట్కు దరఖాస్తు చేసుకోవడానికి మార్గం సుగమమైంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.