యాప్నగరం

OU PG EXAMS: ఊహాగానాలు నమ్మొద్దు.. షెడ్యూల్‌ ప్రకారం పరీక్షలు..!

పీజీ పరీక్షలపై వస్తున్న ఎలాంటి ఊహాగాలను, వదంతలను నమ్మవద్దని పరీక్షల నిర్వహణ విభాగం కోరింది.

Samayam Telugu 26 Oct 2020, 6:29 pm
ఇటీవల కురిసిన భారీగా వర్షాలకు హైదరాబాద్ మహానగరం అతలాకుతలమైంది. వీధులన్నీ చెరువులను తలపించాయి. అనేక కాలనీలను వరద నీరు ముంచెత్తింది. ఈ నేపథ్యంలో పలు యూనివర్సిటీలు పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ కూడా పీజీ పరీక్షలతో పాటు పలు పరీక్షలను వాయిదా వేసింది.
Samayam Telugu ఉస్మానియా యూనివర్సిటీ


దసరా తరువాత పరీక్షలుంటాయి అంటూ ప్రకటన చేసింది. అయితే ప్రస్తుతం వర్షాలు కొంచెం తగ్గడం, దసరా కూడా ముగియడంతో తిరిగి పరీక్షల తేదీలను ప్రకటించింది. పరీక్ష తేదీలపై రకరకాల ఊహాగానాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అన్నీ రకాల పీజీ చివరి సెమిస్టర్‌ పరీక్షలు (రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌, ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షలు) రేపటి (అక్టోబర్‌ 27) నుంచి షెడ్యూల్‌ ప్రకారం జరుగుతాయని ప్రకటించింది. ఎలాంటి ఊహాగాలను, వదంతలను నమ్మవద్దని కోరింది. అభ్యర్థులు పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌ https://www.osmania.ac.in/ లో చూసుకోవచ్చని పేర్కొంది.

అధికారిక నోటిఫికేషన్‌:

ou

Must read: యుకో బ్యాంక్‌లో 91 జాబ్స్‌

Also read: ఇంజనీరింగ్‌ వాళ్లకు గుడ్‌ఛాన్స్‌.. ఆర్మీలో 191 టెక్‌ జాబ్స్‌.. రాత పరీక్ష లేదు.. శిక్షణలోనే రూ.56 వేల జీతం..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.