యాప్నగరం

Telangana: విద్యార్థులకు ఈనెల 26 వరకు దసరా సెలవులు పొడిగింపు.. ఈ తరగతులకు మాత్రమే..!

TS: దసరా సెలవులు ఈ నెల 9వ తేదీన ముగిసాక.. ఆయా కాలేజీలకు కేవలం లెక్చరర్లు మాత్రమే హాజరవుతారు. తరగతులు మాత్రం అక్టోబర్‌ 26 వరకు ప్రారంభం కావని స్పష్టం చేశారు.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 6 Oct 2022, 4:48 pm
Telangana: తెలంగాణలో అక్టోబర్‌ 9వ తేదీ వరకు విద్యాసంస్థలకు ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించిన విషయం తెలిసిందే. పదో తేదీ నుంచి కాలేజీలు, స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. అయితే.. ఉస్మానియా యూనివర్సిటీ లో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, పీజీ కోర్సుల విద్యార్థులకు మాత్రం ఈ నెల 26 వరకు సెలవులను ప్రకటించారు. ఈ మేరకు రిజిస్టార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ అధికారికంగా ప్రకటన విడుదల చేశారు.
Samayam Telugu Dussehra Holidays


దసరా సెలవులు ఈ నెల 9వ తేదీన ముగిసాక.. ఆయా కాలేజీలకు కేవలం లెక్చరర్లు మాత్రమే హాజరవుతారు. తరగతులు మాత్రం అక్టోబర్‌ 26 వరకు ప్రారంభం కావని స్పష్టం చేశారు. కరోనా కారణంగా రెండేళ్లుగా ప్రథమ, ద్వితీయ సంవత్సరం పీజీ కోర్సుల తరగతుల మధ్య గ్యాప్ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రిజిస్టార్ వివరించారు. ఈ అకడమిక్ ఇయర్ నుంచి ఫస్ట్ ఇయర్ విద్యార్థుల అడ్మిషన్ తర్వాత ఫస్ట్ ఇయర్, సెకండియర్ విద్యార్థులకు ఒకేసారి క్లాసులు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. హాస్టల్స్, మెస్ లు సైతం ఈ నెల 26వ తేదీ నుంచే ప్రారంభం అవుతాయని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

రైల్వేలో 6269 ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండా అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా ఎంపిక.. 10వ తరగతితో పాటు ఈ అర్హతలుండాలి

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 110 ఉద్యోగాలు.. అప్లయ్‌ చేసుకోవడానికి లింక్‌ ఇదే

4 ప్రభుత్వ బ్యాంకుల్లో 2169 ఉద్యోగాలు.. అప్లికేషన్‌ ప్రారంభమైంది.. ఈ నెలలోనే అప్లయ్‌ చేసుకోవాలి
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.