యాప్నగరం

Rozgar Mela : రేపే 71,000 మందికి జాబ్‌ అపాయింట్‌మెంట్ లెటర్స్.. ఉదయం 10.30 గంటలకు..

PM Modi : మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏప్రిల్‌ 13వ తేదీన ఉదయం 10:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అపాయింట్‌మెంట్ లెటర్లను పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 12 Apr 2023, 3:53 pm
Rozgar Mela 2023 : కేంద్ర ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా చేరిన ఉద్యోగులకు ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) జాబ్ లెటర్స్ అందించనున్నారు. రోజ్‌గార్ మేళా పథకంలో భాగంగా దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు, సంస్థల్లో ఉద్యోగాలు పొందిన 71,000 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేయనున్నారు. ఏప్రిల్‌ 13వ తేదీన ఉదయం 10:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అపాయింట్‌మెంట్ లెటర్లను పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు.
Samayam Telugu Prime Minister Rozgar Mela


Rozgar Mela .. ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలనే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకువచ్చిన పథకం. ఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధానమంత్రి నిబద్ధతను నెరవేర్చే దిశగా రోజ్‌గార్ మేళా ఒక ముందడుగు అని ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) పేర్కొంది. రోజ్‌గార్ మేళా మరింత ఉపాధి కల్పనలో ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని.. యువతను వారి సాధికారత కోసం శక్తివంతం చేస్తుందని ఆశిస్తున్నాం. దేశాభివృద్ధిలో భాగస్వామ్యానికి అర్ధవంతమైన అవకాశాలను అందించందని వెల్లడించింది.

TSMS Hall Ticket 2023 : ఈనెల 16న మోడల్‌ స్కూల్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌.. హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

Rozgar Mela 2023 లో ఎంపికైన వాళ్లు.. కేంద్ర ప్రభుత్వశాఖల్లో జూనియర్ ఇంజనీర్లు, లోకో పైలట్లు, టెక్నీషియన్లు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుల్లు, స్టెనోగ్రాఫర్లు, జూనియర్ అకౌంటెంట్లు, గ్రామీణ్ డాక్ సేవకులు, ఆదాయపు పన్ను ఇన్స్పెక్టర్లు, టీచర్లు, నర్సులు, డాక్టర్లు, సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్లు, ఎంటీఎస్‌ వంటి వివిధ పోస్టులకు సంబంధించి ఎంపికైన వారికి ప్రధాని (PM Modi) అపాయింట్‌మెంట్‌ లెటర్లు అందించనున్నారు.
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.