యాప్నగరం

RRB Group C: రైల్వే గ్రూప్-సి పరీక్ష 'కీ' విడుదల.. అభ్యంతరాలకు 18 వరకు గడువు

దేశవ్యాప్తంగా 47.56 లక్షల మంది దరఖాస్తు చేసుకున్న గ్రూప్-సి పోస్టుల భర్తీకి ఆగస్టు, సెప్టెంబరులో మొదటిసారిగా ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించారు.

Samayam Telugu 14 Sep 2018, 12:28 pm
రైల్వేలోని గ్రూప్-సి (అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్) ఉద్యోగాల రాతపరీక్షకు సంబంధించిన 'కీ'ని అధికారులు శుక్రవారం (సెప్టెంబరు 14) ఉదయం విడుదల చేశారు. 'కీ'ని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. 'కీ'పై అభ్యంతరాలను సెప్టెంబరు 14 నుంచి 18 వరకు తెలియజేయవచ్చు. ఇందుకోసం అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యేక లింక్‌ను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు తమ వివరాలను నమోదుచేయడం ద్వారా లాగిన్ అవుతారు. అక్కడ ఆన్‌లైన్ ద్వారా అభ్యంతరాలను తెలపాల్సి ఉంటుంది.
Samayam Telugu rrb


దేశవ్యాప్తంగా 47.56 లక్షల మంది దరఖాస్తు చేసుకున్న ఈ గ్రూప్-సి పోస్టుల భర్తీకి మొదటిసారిగా కంప్యూటర్ ద్వారా ఆగస్టు (9, 17, 20, 21)లో నాలుగు దఫాల్లో రాతపరీక్ష నిర్వహించారు. కేరళలో వరదల కారణంగా వాయిదా పడిన పరీక్షలను సెప్టెంబరు 4న నిర్వహించారు.

ఈ ఏడాది జనవరిలో 26,502 అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్ భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పోస్టులను రెట్టింపు చేస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 60,000 వేలకు చేరాయి. దీనివల్ల మరింత మంది నిరుద్యోగులకు రైల్వే కొలువు పొందే అవకాశం దక్కినట్లైంది.

వెబ్‌సైట్
undefinedలాగిన్ అవడానికి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.