యాప్నగరం

Sankranti 2023 : స్కూళ్లకు సంక్రాంతి సెలవులు మారాయి.. తేదీలివే

Makar Sankranti 2023 : సంక్రాంతి సెలవులు మార్చాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం జనవరి 11 నుంచి 16 వరకు సెలవులు ఉండగా..

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 7 Jan 2023, 2:50 pm
Sankranti holidays 2023 : ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సెలవులు మార్చాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం జనవరి 11 నుంచి 16 వరకు సెలవులు ఉండగా.. వీటిని 12 నుంచి 17వ తేదీ వరకు మార్పు చేశారు. 17వ తేదీన ముక్కనుమ ఉన్నందున సెలవు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణను కోరగా.. అందుకు మంత్రి అంగీకారం తెలిపారు. తాజాగా ఈనెల 18న కూడా సెలవు ఇచ్చింది ప్రభుత్వం. దీంతో ఈనెల 19న స్కూళ్లు పునఃప్రారంభం కానున్నాయి.
Samayam Telugu Sankranti holidays


తెలంగాణలో స్కూళ్లు 5 రోజుల మాత్రమే సంక్రాంతి సెలవులు.. తేదీలివే
తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ సందర్భంగా స్కూళ్లకు సెలవులు ఈనెల 13 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ పండుగ ఉండగా.. 17 వరకు మాత్రమే సెలవులు ఉండనున్నాయి. 18న తిరిగి స్కూళ్లు పునఃప్రారంభంకానున్నాయి. అంటే.. మొత్తం ఈసారి మొత్తం 5 రోజులు మాత్రమే సంక్రాంతి సెలవులు ఇచ్చారు.

Coronavirus : లాక్‌డౌన్‌తో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు..! వాస్తవమెంత..?
COVID : దేశంలో కరోనా కొత్త వేరియంట్ వెలుగుచూసిన కారణంగా త్వరలో స్కూళ్లు, కాలేజీలు బంద్ చేస్తారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. లాక్‌డౌన్ కూడా విధించే అవకాశం ఉందని వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) వీటిపై స్పందించింది. ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని చెప్పింది. ఇదంతా నిరాధారమైన ఫేక్ న్యూస్ అని కొట్టిపారేసింది.

స్కూళ్లు, కాలేజీలకు 15 రోజులు సెలవులు ప్రకటిస్తారనే బోగస్ వార్తలను ఎవరూ నమ్మవద్దని పేర్కొంది. వాస్తవాలు తెలుసుకోవాలని ప్రజలకు సూచించింది. ఈ మేరకు ఫ్యాక్ట్ చెక్ చేసి ట్విట్టర్‌లో పోస్టు చేసింది. మరోవైపు చలి తీవ్రత బాగా పెరగడంతో కాన్పూర్, నోయిడా లక్నో, బిహార్, జార్ఖండ్, పంజాబ్, ఢిల్లీలోని పలు పాఠశాలలను మూసివేశారు. పొగమంచు కారణంగా కొన్ని చోట్ల స్కూళ్ల సమయాన్ని మార్చారు. అంతేగానీ కరోనా కారణంగా సెలవులు ప్రకటించలేదని స్పష్టం చేసింది.
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.