కరోనా వచ్చింది సమస్తం మార్చింది. మార్పులో విద్యా రంగం ప్రథమ స్థానంలో ఉంది. బడికి పోవడం, క్లాస్ రూం టీచింగ్ ఇవేమీ లేవు. ఇంటి దగ్గరే చదువులు. ఈ పరిస్థితుల్లో పిల్లలు చదువుకు నష్టం కలగకూడదు అంటే.. టీచర్లు బోధించే శైలి, పిల్లలు పాఠాలను అర్థం చేసుకునే విధానం మారాలి.
ఇదే ఆలోచనతో సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ తరహాలో పాఠశాల విద్యాశాఖ వర్క్షీట్లు ప్రవేశపెట్టాలని ప్రయత్నిస్తోంది. ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు ఈ వర్క్షీట్లను అందించాలని భావిస్తోంది. సబ్జెక్ట్ నిపుణులతో పాఠాల వారీగా తయారు చేయించే పనిలో రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ఉంది.
రెండు స్థాయిల్లో ఈ వర్క్షీట్లను రూపొందించాలని భావిస్తున్నారు. ఈ ప్రక్రియ దాదాపు పూర్తికావొచ్చింది. ఈ విధానం అమలు చేయడంతోపాటు వాటిని విద్యార్థులకు అందించేందుకు అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు.
Must read: ఈ నెల 31 వరకు విద్యా సంస్థలు మూత.. ఖచ్చితంగా పాటించాలన్న కేంద్రం
అసలేంటీ వర్క్షీట్లు..?
స్కూల్లో టీచర్ పాఠం చెప్పిన తర్వాత పిల్లలకు హోంవర్క్ ఇవ్వడం తెలిసిందే. ఇవి మామూలుగా ఆ రోజు బోధించిన పాఠంలోని అంశాలపై ప్రశ్నలు, జవాబుల రూపంలో ఉంటాయి.
కానీ వర్క్షీట్లు వీటికి కొంచెం భిన్నంగా ఉంటాయి. విద్యార్థి సృజనాత్మకత, తర్కం, విశ్లేషణ తదితర సామర్థ్యాలను పరిశీలించేలా, పాఠాలను అన్నీ కోణాల్లో అర్థం చేసుకునేలా ఉంటాయి.
ఈ విధానం వల్ల ఉపాధ్యాయులు చెప్పిన దానికంటే విద్యార్థులు సొంతంగా ఆలోచించి నేర్చుకునేందుకు వీలుంటుంది. అలాగే ఒక విద్యార్థి ఆ పాఠ్యాంశాన్ని ఎంత వరకు అర్థం చేసుకున్నాడో అంచనా వేసే వీలుంటుంది.
Must read: సబ్జెక్టుల వారీగా సీబీఎస్ఈ 2020-21 కొత్త సిలబస్ వివరాలు
ఇదే ఆలోచనతో సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ తరహాలో పాఠశాల విద్యాశాఖ వర్క్షీట్లు ప్రవేశపెట్టాలని ప్రయత్నిస్తోంది. ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు ఈ వర్క్షీట్లను అందించాలని భావిస్తోంది. సబ్జెక్ట్ నిపుణులతో పాఠాల వారీగా తయారు చేయించే పనిలో రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ఉంది.
రెండు స్థాయిల్లో ఈ వర్క్షీట్లను రూపొందించాలని భావిస్తున్నారు. ఈ ప్రక్రియ దాదాపు పూర్తికావొచ్చింది. ఈ విధానం అమలు చేయడంతోపాటు వాటిని విద్యార్థులకు అందించేందుకు అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు.
Must read: ఈ నెల 31 వరకు విద్యా సంస్థలు మూత.. ఖచ్చితంగా పాటించాలన్న కేంద్రం
అసలేంటీ వర్క్షీట్లు..?
స్కూల్లో టీచర్ పాఠం చెప్పిన తర్వాత పిల్లలకు హోంవర్క్ ఇవ్వడం తెలిసిందే. ఇవి మామూలుగా ఆ రోజు బోధించిన పాఠంలోని అంశాలపై ప్రశ్నలు, జవాబుల రూపంలో ఉంటాయి.
కానీ వర్క్షీట్లు వీటికి కొంచెం భిన్నంగా ఉంటాయి. విద్యార్థి సృజనాత్మకత, తర్కం, విశ్లేషణ తదితర సామర్థ్యాలను పరిశీలించేలా, పాఠాలను అన్నీ కోణాల్లో అర్థం చేసుకునేలా ఉంటాయి.
ఈ విధానం వల్ల ఉపాధ్యాయులు చెప్పిన దానికంటే విద్యార్థులు సొంతంగా ఆలోచించి నేర్చుకునేందుకు వీలుంటుంది. అలాగే ఒక విద్యార్థి ఆ పాఠ్యాంశాన్ని ఎంత వరకు అర్థం చేసుకున్నాడో అంచనా వేసే వీలుంటుంది.
Must read: సబ్జెక్టుల వారీగా సీబీఎస్ఈ 2020-21 కొత్త సిలబస్ వివరాలు