యాప్నగరం

Semester System in AP Schools : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ స్కూళ్లలో సెమిస్టర్‌ విధానం.. సంచలన నిర్ణయం తీసుకున్న జగన్‌ సర్కార్‌

AP Govt Schools Semester System : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ స్కూళ్లలో సెమిస్టర్‌ విధానం ప్రవేశ పెట్టనుంది. తాజాగా ప్రభుత్వం ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల్లోకెళ్తే..

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 17 Dec 2022, 4:43 pm
Semester System in AP Government Schools : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ స్కూళ్లలో సెమిస్టర్‌ విధానం ప్రవేశపెట్టనుంది. తాజాగా ప్రభుత్వం ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది.1వ తరగతి నుంచి 9వ తరగతి వరకూ.. 2023-24 విద్యా సంవత్సరం నుంచి రెండు సెమిస్టర్‌లు.. అలాగే పదో తరగతికి సంబంధించి 2024-25 సంవత్సరం నుంచి సెమిస్టర్‌ విధానం ప్రవేశపెట్టనున్నారు. ఇక విద్యా సంవత్సరం ప్రారంభంలోనే రెండు సెమిస్టర్‌లకు జగనన్న విద్యా కానుక ద్వారా పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. త్వరలోనే ఈ సెమిస్టర్ విధానానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేయనున్నారు.
Samayam Telugu Semester System in AP Schools


AP CDPO : ఏపీ అంగన్‌వాడీ కేంద్రాల్లో CDPO ఉద్యోగాలు.. వెంటనే భర్తీ చేయాలని సీఎం జగన్‌ ఆదేశం
APPSC CDPO Recruitment 2022 : ఆంధ్రప్రదేశ్‌ అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 61 సీడీపీవో (AP CDPO) పోస్టులను భర్తీ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి (CM Jagan) ఆదేశించారు. వీటి నియామకాలను ఏపీపీఎస్సీ (APPSC) ద్వారా చేపట్టనున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మహిళాశిశు సంక్షేమశాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలి. నాడు-నేడు కింద చేపడుతున్న పనులను వేగవంతం చేయాలి. పిల్లలకు కల్పిస్తున్న సౌకర్యాల్లో నాణ్యత పెరగాలి. కరికులమ్‌ కూడా మారాలి. పాఠ్యప్రణాళిక మార్పు కోసం అవసరమైతే ప్రత్యేక అధికారిని నియమించాలి. కొత్తగా నియమించిన సూపర్‌వైజర్ల సహాయంతో అంగన్‌వాడీ కేంద్రాల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలి.

సూపర్‌వైజర్‌ సిస్టం ద్వారా అంగన్‌వాడీల నాణ్యత పెరుగుతుంది. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, గృహనిర్మాణం, మహిళాశిశు సంక్షేమశాఖలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సిబ్బంది నియామకాలు సహా ఏ రకమైన అవసరమున్నా ప్రభుత్వం అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఫలితాలు కూడా అదేవిధంగా ఉండాలని’ ముఖ్యమంత్రి జగన్‌ అధికారులకు సూచించారు.
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.