యాప్నగరం

Colleges Reopen : విద్యార్థులకు అలర్ట్‌.. ముగిసిన వేసవి సెలవులు.. రేపటి నుంచి క్లాసులు ప్రారంభం

School Holidays : తెలుగు రాష్ట్రాల్లో జూన్‌ 1 నుంచి ఇంటర్‌ కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి. అడ్మిషన్ల ప్రక్రియ కూడా కొనసాగుతోంది. స్కూళ్లు మాత్రం జూన్‌ 12 నుంచి పునఃప్రారంభం కానున్నాయి.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 31 May 2023, 10:59 am
School Holidays 2023 : ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో జూనియర్‌ కాలేజీలకు నేటితో (మే 31) వేసవి సెలవులు ముగియనున్నాయి. రేపటి (జూన్‌ 1) నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఏపీలో జూన్‌ 14 వరకు మొదటి విడత ప్రవేశాల ప్రక్రియ కొనసాగనుంది. తెలంగాణ, ఏపీలో 2023-24 విద్యా సంవత్సరంలో 227 రోజులు ఇంటర్‌ కాలేజీలు నడవనున్నాయి. ఇక.. స్కూళ్లకు విషయానికొస్తే.. ఏప్రిల్ 25 నుంచి జూన్ 11వ తేదీ వరకు పాఠశాలలకు ఈ ఏడాది వేసవి సెలవులు (Summer Holidays) ఉంటాయని విద్యాశాఖ పేర్కొన్న విషయం తెలిసిందే. మొత్తం 48 రోజుల సెలవుల అనంతరం.. తిరిగి జూన్ 12వ తేదీన పాఠశాలలు పున: ప్రారంభం కానున్నాయి.
Samayam Telugu Colleges Reopen


TSMJBC : గురుకుల ఇంటర్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల.. లింక్‌ ఇదే
TSMJBC MJP Inter Results 2023 : తెలంగాణ రాష్ట్రంలోని బీసీ గురుకుల కాలేజీల్లో 2023-24 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌, అధికారులు విడుదల చేశారు. ఫలితాలను బీసీ గురుకుల వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు వివరించారు. సీట్లు పొందిన విద్యార్థులు జూన్‌ 1 నుంచి 10వ తేదీలోగా సంబంధిత కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించారు.

TSMJBC MJP Inter Results 2023 లింక్‌ ఇదే.. క్లిక్ చేయండి

TS Inter Supplementary Hall Ticket 2023 : త్వరలో తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ హాల్‌టికెట్లు.. పూర్తి వివరాలివే
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.