యాప్నగరం

AP Summer Holidays 2022: ఏపీలో స్కూళ్లకు వేసవి సెలవులు.. మే 6 నుంచి.. ఎప్పటి వరకో తెలుసా..?

AP School Summer Holidays 2022: ఏపీలో ప్రభుత్వం స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించింది. మే 6వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్నీ స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాల్లోకెళ్తే..

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 23 Apr 2022, 11:23 pm
Samayam Telugu ఏపీలో స్కూళ్లకు వేసవి సెలవులు
AP Summer Holidays 2022: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించింది. మే 6వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్నీ స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. మే 4వ తేదీలోగా అన్నీ పరీక్షలు పూర్తి చేయాలని పాఠశాలల యాజమాన్యాలను ఆదేశించింది. ఇక.. జులై 4వ తేదీ స్కూళ్లు తిరిగి పునఃప్రారంభంకానున్నట్టు పేర్కొంది.

తెలంగాణ విద్యార్థులకు రేపటి నుంచే వేసవి సెలవులు
తెలంగాణ పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏప్రిల్ 24వ తేదీ నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించింది. పాఠశాలలు జూన్ 13వ తేదీన తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ వేసవి సెలవులు ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు మాత్రమే వర్తిస్తాయి.

మే 23 నుంచి జూన్‌ 1 వరకు టెన్త్ క్లాస్ పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే రేపటి నుంచి పదో తరగతి విద్యార్థులకు రివిజన్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. దీంతో రోజుకొక టీచర్‌ పాఠశాలకు హాజరై రివిజన్ క్లాసులు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది.

AP 10th class Model Papers: ఏపీ 10వ త‌ర‌గ‌తి పాత మోడ‌ల్‌పేప‌ర్స్.. సబ్జెక్టుల వారీగా.. తెలుగు, ఇంగ్లిష్‌ మీడియంలో.. మీ కోసం
AP 10th Class Exams 2022: ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ పరీక్షలు త్వరలో ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలు ఏప్రిల్‌ 27 నుంచి మే 9వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్‌టికెట్‌ చూస్తే సరిపోతుంది. రాష్ట్రంలో 3,780 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు 6,22,746 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.

ఏపీలో టెన్త్ పరీక్షలు సబ్జెక్టుల వారీగా ఇలా ఉన్నాయి.. క్లిక్‌ చేయండి:
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.