యాప్నగరం

నీట్ ఫలితాలపై స్పష్టతనిచ్చిన సుప్రీం..

నీట్ 2017 ఫలితాలను నిలిపివేయాలంటూ మద్రాస్ హైకోర్టు మే 24న స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై విచారణ చేపట్టిన భారత అత్యున్నత న్యాయస్థానం..

TNN 12 Jun 2017, 12:32 pm
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) 2017 ఫలితాలను విడుదల చేయాల్సిందే అంటూ సుప్రీంకోర్టు ఇవాళ (జూన్ 12) తేల్చి చెప్పింది. నీట్ 2017 ఫలితాలను నిలిపివేయాలంటూ మద్రాస్ హైకోర్టు మే 24న స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై విచారణ చేపట్టిన భారత అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు స్పష్టం చేసింది. దీంతో రెండు వారాల్లోగా నీట్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు సీబీఎస్‌ఈ ప్రకటించింది. జూన్ 26 కంటే ముందే రిజల్ట్స్ వెలువడనున్నాయి. ఇతర లాంగ్వేజ్‌ ప్రశ్నాపత్రాలతో పోల్చినప్పుడు.. ఇంగ్లిష్, హిందీ భాషలకు సంబంధించిన ప్రశ్నాపత్రాల్లో కొన్ని భిన్నమైన ప్రశ్నలను ఇచ్చారని, దీని వల్ల అభ్యర్థులపై ప్రభావం పడుతుందని కొంత మంది మద్రాస్ హై కోర్టును ఆశ్రయించారు. మరోవైపు అది కావాలని చేసిందేనని సీబీఎస్‌ఈ వివరణ ఇచ్చింది.
Samayam Telugu supreme court orders neet results be declared cbse to announce them in 2 weeks
నీట్ ఫలితాలపై స్పష్టతనిచ్చిన సుప్రీం..


ఈ పిటిషన్‌ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం ఫలితాలను వెంటనే విడుదల చేయాలంటూ తాజాగా తీర్పు చెప్పింది. అంతేకాకుండా నీట్ - 2017 అంశంపై తప్పనిసరి అయితే తప్ప.. ఎలాంటి పిటిషన్లను స్వీకరించొద్దని అన్ని హై కోర్టులకు స్పష్టం చేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్టుల్లో ప్రవేశాలకు సంబంధించిన నీట్ పరీక్షకు ఈ ఏడాది దేశవ్యాప్తంగా 11.38 లక్షల మంది హాజరయ్యారు. ఇందులో 10.5 లక్షల మంది విద్యార్థులు ఇంగ్లిష్, హిందీ భాషల్లో పరీక్ష రాయగా, మిగిలిన వారు 8 ఇతర భాషల్లో పరీక్ష రాశారు.

ఫలితాల విడుదలలో జాప్యం జరిగితే అది ప్రవేశాల ప్రక్రియపై ప్రభావం చూపుతుందని, విద్యార్థులను ఆందోళనలో పడేయడం సరికాదని అదనపు సోలిసిటర్ జనరల్ మనీందర్ సింగ్ కూడా సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని ఇంతకుముందే కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.