తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ తరగతుల్లో పాల్గొనేందుకు వీలుగా విద్యార్థులకు ప్రతిరోజూ 2 జీబీ డేటాను తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ఉచితంగా అందజేయనున్నారు. తమిళనాడు రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా గత మార్చి 21వ తేదీ నుంచి లాక్డౌన్ ప్రకటించారు. దీంతో స్కూళ్లు, కాలేజీలు మూతబడ్డాయి.
కరోనా నానాటికీ అధికమవుతున్నందున విద్యాసంస్థలను ప్రారంభించడంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ పరిస్థితుల్లో లాక్డౌన్ ఉత్తర్వులు జారీ చేసి పదినెలలకు పైగా కావస్తున్న స్థితిలో ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో విద్యార్థుల చదువు కుంటుపడే పరిస్థితి ఏర్పడింది. దీంతో విద్యాసంస్థలను ప్రారంభించాల్సిన పరిస్థితి నెలకొంది.
ఈ క్రమంలో పీజీ విద్యార్థులకు డిసెంబర్ రెండవ తేదీ నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి. యూజీ విద్యార్థులకు తరగతులను ప్రారంభించేందుకు నిర్ణయించారు. ఇలావుండగా కొత్త కరోనా వైరస్ వ్యాప్తితో కాలేజీలు ప్రారంభించేందుకు చిక్కులు ఏర్పడ్డాయి. దీంతో విద్యార్థులకు ఆన్లైన్, టీవీల ద్వారా విద్యాబోధన చేపట్టేందుకు నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో కొందరు విద్యార్థులు సాంకేతిక సౌకర్యాలు లేక కష్టపడుతున్నందున ప్రత్యేక మార్గాలను అన్వేషించాల్సి వచ్చింది. దీంతో ఆన్లైన్ తరగతులలో పాల్గొనేందుకు వీలుగా 9.69 లక్షల మంది కళాశాల విద్యార్థులకు ప్రతిరోజు 2 జీబీ డేటా ఉచితంగా అందజేసేందుకు ముఖ్యమంత్రి ఎడపాడి ఉత్తర్వులు జారీ చేశారు.
కరోనా నానాటికీ అధికమవుతున్నందున విద్యాసంస్థలను ప్రారంభించడంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ పరిస్థితుల్లో లాక్డౌన్ ఉత్తర్వులు జారీ చేసి పదినెలలకు పైగా కావస్తున్న స్థితిలో ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో విద్యార్థుల చదువు కుంటుపడే పరిస్థితి ఏర్పడింది. దీంతో విద్యాసంస్థలను ప్రారంభించాల్సిన పరిస్థితి నెలకొంది.
ఈ క్రమంలో పీజీ విద్యార్థులకు డిసెంబర్ రెండవ తేదీ నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి. యూజీ విద్యార్థులకు తరగతులను ప్రారంభించేందుకు నిర్ణయించారు. ఇలావుండగా కొత్త కరోనా వైరస్ వ్యాప్తితో కాలేజీలు ప్రారంభించేందుకు చిక్కులు ఏర్పడ్డాయి. దీంతో విద్యార్థులకు ఆన్లైన్, టీవీల ద్వారా విద్యాబోధన చేపట్టేందుకు నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో కొందరు విద్యార్థులు సాంకేతిక సౌకర్యాలు లేక కష్టపడుతున్నందున ప్రత్యేక మార్గాలను అన్వేషించాల్సి వచ్చింది. దీంతో ఆన్లైన్ తరగతులలో పాల్గొనేందుకు వీలుగా 9.69 లక్షల మంది కళాశాల విద్యార్థులకు ప్రతిరోజు 2 జీబీ డేటా ఉచితంగా అందజేసేందుకు ముఖ్యమంత్రి ఎడపాడి ఉత్తర్వులు జారీ చేశారు.