యాప్నగరం

'పది'లో ఆన్‌స్క్రీన్‌ మూల్యాంకనానికి నిర్ణయం

ఆన్‌స్క్రీన్ మూల్యాంకనానికి సంబంధించి ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాల్సి ఉన్నందున సప్లిమెంటరీ పరీక్షల్లో ఒక సబ్జెక్టు చేస్తామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ విజయకుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Samayam Telugu 29 Nov 2019, 6:15 pm
తెలంగాణలో పదోతరగతి పరీక్షల మూల్యాంకనానికి సంబంధించి ఆన్‌స్క్రీన్ విధానాన్ని అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే మొదట భావించినట్లుగా ప్రధాన పరీక్షల మూల్యాంకనానికి బదులుగా సప్లిమెంటరీ పరీక్షలకు ఆన్‌స్క్రీన్ మూల్యాంకనం అమలు చేయనున్నారు. ప్రధాన పరీక్షల నాటికి ఈ విధానాన్ని అమలు చేయడం సాధ్యం కాదని భావించిన అధికారులు సప్లిమెంటరీ పరీక్షలకే అమలు చేయాలని నిర్ణయించారు.
Samayam Telugu exams


గురుకుల ఇంటర్ ప్రవేశాలు.. దరఖాస్తు ప్రారంభం

వచ్చే ఏడాది నిర్వహించే పదోతరగతి పరీక్షలకు దాదాపు 5.5 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. సరైన ప్రణాళికలు లేకుండా వీరందరికీ ఆన్‌స్క్రీన్ మూల్యాంకన విధానాన్ని అమలు చేయడం కష్టం.. అదే సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య దాదాపు 60 వేల వరకు ఉంటోంది. కాబట్టి సప్లిమెంటరీ పరీక్షలకే ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలుచేయనున్నారు.

క‌లికిరి సైనిక్ స్కూల్‌లో ప్రవేశాలు.. వీరికి ప్రత్యేకం


సప్లిమెంటరీ పరీక్షల్లో మొదట కేవలం ఒక సబ్జెక్టుకు మాత్రమే ఆన్‌స్క్రీన్ మూల్యాంకనం చేస్తామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆలోపు ఉపాధ్యాయులకు అవసరమైన శిక్షణ ఇస్తామని ఆయన అన్నారు.

GATE 2020 పరీక్షల షెడ్యూలు విడుదల


Read More..

మరింత ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి..
మరింత విద్యాసమాచారం కోసం క్లిక్ చేయండి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.