తెలంగాణా రాష్ట్రంలో పదోతరగతి పరీక్షల ఫలితాలను బుధవారం విడుదల చేయనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చేతులు మీదుగా ఫలితాలు విడుదల కానున్నాయి. మే 5న విడుదల చేయాలని ముందుగా అనుకున్నా రెండు రోజుల ముందుగానే ఫలితాలను విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది మార్చి 14 నుంచి 30 వరకు పదోతరగతి పరీక్షలు అయ్యాయి. ఈ పరీక్షలకు 5,09,831 మంది విద్యార్థులు హాజరయ్యారు. పదోతరగతి ఫలితాల కోసం విద్యార్థులంతా ఎదురుచూస్తున్నారు.
రేపే పదోతరగతి పరీక్షా ఫలితాలు
తెలంగాణా రాష్ట్రంలో పదోతరగతి పరీక్షల ఫలితాలను బుధవారం విడుదల చేయనున్నారు.
TNN 2 May 2017, 2:37 pm