యాప్నగరం

టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆరు మార్కులు అదనం

టెన్త్ పరీక్షలు రాసిన విద్యార్థులకు గుడ్ న్యూస్. మ్యాథ్స్ ప్రశ్నపత్రంలో తప్పులు దొర్లడంతో ఆరు మార్కులు కలపాలని తెలంగాణ విద్యాశాఖ నిర్ణయించింది. ప్రశ్నలకు ఆన్సర్లు రాయడానికి ప్రయత్నించిన వారికి ఈ మార్కులను కలపనున్నారు.

Samayam Telugu 16 Apr 2019, 10:44 pm
హైదరాబాద్‌: టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసిన విద్యార్థులకు గుడ్ న్యూస్. మ్యాథ్స్ ప్రశ్నపత్రంలో ఆరు మార్కులను అదనంగా కలపాలని విద్యాశాఖ నిర్ణయించింది. ప్రశ్నపత్రంలో తప్పులు దొర్లడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సదరు ప్రశ్నలకు జవాబు రాయడానికి ప్రయత్నించిన విద్యార్థులందరికీ ఆరు మార్కులను కలపనున్నారు. ఈ మేరకు జిల్లా స్పాట్‌ కేంద్రాలకు ఆదేశాలు జారీచేశారు. మ్యాథ్స్ పేపర్‌-1లో ఐదున్నర మార్కులు, పేపర్‌-2లో అరమార్కు కలపనున్నారు.
Samayam Telugu ssc


పేపర్‌-1 విషయానికి వస్తే.. పార్ట్‌-ఏలోని ఆరో ప్రశ్నకు ఒక మార్కు కలపనుండగా.. 16వ ప్రశ్నకు 4మార్కులు, పార్ట్‌ -బీలోని 7వ ప్రశ్నకు అర మార్కు కలపనున్నారు. పేపర్‌-2 లో పార్ట్‌- బీలో నాలుగో ప్రశ్నకు అర మార్కును కలపనున్నారు. తెలంగాణ గణిత ఫోరం ప్రశ్నపత్రంలోని తప్పులను గుర్తించి, పరీక్షల విభాగం అధికారులకు దృష్టికి తెచ్చింది. దీంతో స్పందించిన అధికారులు విద్యార్థుల నష్టపోకుండా చూడటం కోసం మార్కులు కలపాలని నిర్ణయించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.