యాప్నగరం

తెలంగాణలో రేపటి నుంచి 6,7,8 తరగతులు ప్రారంభం

Telangana Schools Reopening: తెలంగాణలో రేపటి నుంచి మార్చి 1వ తేదీ లోపు 6,7,8 క్లాసులు ప్రారంచుకోవచ్చని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.

Samayam Telugu 23 Feb 2021, 3:18 pm
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో మరికొన్ని తరగతులకు తరగతి గది బోధన (క్లాస్‌రూం టీచింగ్‌) ప్రారంభించడంపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటి (ఫిబ్రవరి 24- బుధవారం) నుంచి 6,7,8 తరగతులు ప్రారంభించుకోవచ్చని ప్రభుత్వం సూచించింది.
Samayam Telugu స్కూళ్లు పునఃప్రారంభం


రేపటి నుంచి మార్చి 1వ తేదీ లోపు 6,7,8 క్లాసులు ప్రారంచుకోవచ్చని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. అయితే తరగతలు ప్రారంభించే విషయంలో ఆయా విద్యాసంస్థలు కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. అలాగే స్కూళ్లకు వచ్చే విద్యార్థులకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. విద్యార్థులు పాఠశాలకు విధిగా హాజరుకావాలన్న నిబంధనేది లేదని.. పిల్లలను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరని పేర్కొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.