యాప్నగరం

TSRTC strike: విద్యాసంస్థలకు సెలవులు.. షరతులు వర్తిస్తాయి

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు అక్టోబరు 19 వరకు ప్రభుత్వం సెలవులు మంజూరు చేసింది.. అక్టోబరు 20 ఆదివారం కావడంతో అక్టోబరు 21 నుంచి విద్యాసంస్థులు తిరిగి తెరచుకోనున్నాయి..

Samayam Telugu 13 Oct 2019, 9:11 pm

ప్రధానాంశాలు:

  • ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో 19 వరకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
  • బదులుగా రెండో శనివారం తరగతుల నిర్వహణ

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu inter
తెలంగాణలో ఆర్టీసీ (TSRTC) సమ్మె నేపథ్యంలో అక్టోబరు 19 వరకు దసరా సెలవులను పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి అక్టోబరు 12న ఉత్తర్వులు కూడా జారీచేశారు. దీనిప్రకారం.. మెడికల్ కళాశాలలకు తప్ప రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు, డిగ్రీ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్, లా, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ కాలేజీలతోపాటు యూనివర్సిటీ కళాశాలలకు ఈ సెలవులు వర్తించనున్నాయి.
Read Also: దసరా సెలవులు పెరిగాయోచ్.. ఎప్పటిదాకంటే?

రెండో శనివారం తరగతుల నిర్వహణ...
విద్యార్థులకు నష్టం కలగకుండా ఉండేందుకు ప్రస్తుతం ప్రకటించన సెలవులకు బదులుగా 2020 ఏప్రిల్ వరకు రెండో శనివారాల్లో తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

Must Read: గ్రామ వాలంటీర్ పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్

తరగతులు నిర్వహిస్తే చర్యలు - ఇంటర్ బోర్డు కార్యదర్శి
అక్టోబరు 19 వరకు అమల్లో ఉన్న సెలవురోజుల్లో రాష్ట్రంలోని జూనియర్ కళాశాలల్లో తరగతులు నిర్వహించొద్దని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఒకవేళ ఎవరైనా ఉత్తర్వులు ఉల్లంఘిస్తే ఆయా విద్యాసంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Read More..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.