ఎండలు బాగా పెరగడంతో ఒంటిపూట బడులు నిర్వహించేందుకు తెలంగాణ విద్యాశాఖ సమాయత్తమవుతోంది. మార్చి 22 లేదా 23 నుంచి ఒంటిపూట తరగతులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మొదటగా 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఒంటిపూట బడులు ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపింది. ప్రభుత్వం త్వరలో తుది నిర్ణయం తీసుకోనుంది. ఇక ఒంటిపూట బడులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉండనున్నాయి. అంటే.. రోజూ నాలుగన్నర గంటల పాటూ తరగతులు నిర్వహించాలన్నది విద్యాశాఖ ఆలోచనగా తెలుస్తోంది.
ఈ ఏడాది కరోనా వల్ల విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైంది. ఫిబ్రవరి 1 నుంచి 9, 10 తరగతులకు ప్రారంభం కాగా.. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 1 వరకూ 6, 7, 8 తరగతులు ప్రారంభమయ్యాయి. అయితే కరోనా మళ్లీ అధికమవుతుండటంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయం మొదలైంది. ఈ పరిస్థితుల్లో 6, 7, 8, 9 తరగతులకు ఒంటిపూట బడులు నిర్వహించి.. పదో తరగతి విద్యార్థులకు మాత్రం రెండు పూటలా స్కూళ్లు నిర్వహించాలనే ప్రతిపాదన ఉంది.
ఎందుకంటే పదో తరగతి విద్యార్థులకు మే 17 నుంచి పబ్లిక్ పరీక్షలున్నాయి. త్వరలో ఈ అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఇక ఈ విద్యా సంవత్సరానికి మే 26ను చివరి పని దినంగా ప్రకటించారు. మార్చి 22 నుంచి ఒంటిపూట తరగతులకు అనుమతిస్తే.. దాదాపు రెండు నెలలపాటు ఒంటిపూట బడులు జరుగనున్నాయి.
ఈ ఏడాది కరోనా వల్ల విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైంది. ఫిబ్రవరి 1 నుంచి 9, 10 తరగతులకు ప్రారంభం కాగా.. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 1 వరకూ 6, 7, 8 తరగతులు ప్రారంభమయ్యాయి. అయితే కరోనా మళ్లీ అధికమవుతుండటంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయం మొదలైంది. ఈ పరిస్థితుల్లో 6, 7, 8, 9 తరగతులకు ఒంటిపూట బడులు నిర్వహించి.. పదో తరగతి విద్యార్థులకు మాత్రం రెండు పూటలా స్కూళ్లు నిర్వహించాలనే ప్రతిపాదన ఉంది.
ఎందుకంటే పదో తరగతి విద్యార్థులకు మే 17 నుంచి పబ్లిక్ పరీక్షలున్నాయి. త్వరలో ఈ అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఇక ఈ విద్యా సంవత్సరానికి మే 26ను చివరి పని దినంగా ప్రకటించారు. మార్చి 22 నుంచి ఒంటిపూట తరగతులకు అనుమతిస్తే.. దాదాపు రెండు నెలలపాటు ఒంటిపూట బడులు జరుగనున్నాయి.