యాప్నగరం

16,781 పోస్టుల భర్తీకి రేపటి నుంచే దరఖాస్తులు

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావాలంటీర్ల నియామకానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో జులై 13 నుంచి 16 వరకు దరఖాస్తుల ప్రక్రియ సాగనుంది.

Samayam Telugu 12 Jul 2018, 1:29 pm
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావాలంటీర్ల నియామకానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో జులై 13 నుంచి 16 వరకు దరఖాస్తుల ప్రక్రియ సాగనుంది. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు విజయ్‌కుమార్ డీఈఓలను ఆదేశించారు. డీఈఓలు 18న కలెక్టర్ ఛైర్మన్‌గా ఉన్న కమిటీ ఆమోదంతో వాటిని ఎంఈఓలకు పంపిస్తారు. వారు 19న విద్యాకమిటీలకు అందజేస్తారు. విద్యాకమిటీలు వారితో ఒప్పందం కుదుర్చుకుంటారు. జులై 20 నుంచి వారు విధుల్లోకి చేరాల్సి ఉంటుంది. రెగ్యులర్ టీచర్ పోస్టులను భర్తీచేసే వరకు వీరిని కొనసాగించనున్నారు. వీరికి నెలకు రూ.12 వేల గౌరవవేతనం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Samayam Telugu education


రాష్ట్రంలో 16,781 మంది విద్యావాలంటీర్ల నియామకానికి తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. 20లోగా విద్యావాలంటీర్లను నియమించాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఈ నెల 13 నుంచి 16 వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని ,17న ఎంఈవో వెరిఫికషన్‌ చేసి.. లిస్ట్‌ను డీఈవోకు పంపాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది. ఈ నెల 20 నుంచి విద్యావాలంటీర్లు విధుల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించించిన నేపథ్యంలో రేపటి నంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.