తెలంగాణ రాష్ట్రంలోని పలు యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ల పోస్టులను తక్షణమే భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. యూనివర్సిటీల్లో మొత్తం పోస్టులు 1,528 వరకు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వాటిలో 323 ప్రొఫెసర్ పోస్టులు, 687 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, 518 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులను సీఎం కేసీఆర్ ఆమోదంతో త్వరలోనే భర్తీ చేయడానికి ఉన్నత విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. నాన్టీచింగ్ పోస్టులతోపాటు అవసరమైన చోట కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పోస్టులను కూడా భర్తీ చేయడానికి సానుకూలంగా ఉన్నట్లు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, యూనివర్సిటీ వైస్ చాన్స్లర్లకు వెల్లడించారు. యూనివర్సిటీల అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే వైస్ చాన్స్లర్ల నియామకం కూడా ప్రభుత్వం చేపట్టింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ యూనివర్శిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు..
యూనివర్సిటీల అభివృద్ధిలో భాగంగా రాష్ట్రంలో ఉన్నత విద్యను బలోపేతం దిశగా పీజీ, పీహెచ్డీ అడ్మిషన్ల విధానంలో రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణలు చేపడుతుంది. కొన్ని సంవత్సరాలుగా యూనివర్సిటీల్లో పోస్టుగ్రాడ్యుయేషన్, పీహెచ్డీ అడ్మిషన్ల విధానంలో అనేక లోటుపాట్లు నెలకొన్నాయని ఉన్నత విద్యాశాఖ ఉన్నతాధికారులు భావించారు. ఫలితంగా మెరిట్ విద్యార్థులకు అడ్మిషన్లు లభించడం లేదన్న విషయం సర్కార్ దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో తొలుత పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) అడ్మిషన్ల విధానంలో సంస్కరణలు తీసుకువచ్చే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. అందుకోసం ఓయూ వీసీ ప్రొఫెసర్ రామచంద్రం, జేఎన్టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ వేణుగోపాల్రెడ్డి, బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ సీతారామారావులతో కమిటీ వేశారు. మరోవైపు అన్ని యూనివర్సిటీల్లో విస్తృత స్థాయిలో పరిశోధనలు చేపట్టాలన్న అంశంపైనా ప్రభుత్వం దృష్టి సారించింది.
పీహెచ్డీ అడ్మిషన్ల విధానంలోనూ సంస్కరణలు తీసుకువస్తున్నారు. ఈ అంశాన్ని కూడా ముగ్గురు వీసీలతో ఏర్పాటు చేసిన కమిటీలో చర్చించనున్నారు. అన్ని యూనివర్సిటీల్లో పరిశ్రమలు, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కోర్సులను రీ డిజైనింగ్ చేయడానికి నడుం బిగించారు. దీనిపై కూడా త్వరలోనే మరో ఇద్దరు వీసీలతో మరో కమిటీ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ చర్యలు చేపట్టింది. వర్సిటీల్లో భవన నిర్మాణాలు, వాటి మరమ్మతులు, కనీస వసతి సదుపాయాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడానికి సర్కారు సానుకూలంగా ఉన్నది. దీంతో వర్సిటీల్లో నాణ్యమైన విద్యావిధానంపై దృష్టి పెట్టాలని అధికారులు భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ యూనివర్శిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు..
యూనివర్సిటీల అభివృద్ధిలో భాగంగా రాష్ట్రంలో ఉన్నత విద్యను బలోపేతం దిశగా పీజీ, పీహెచ్డీ అడ్మిషన్ల విధానంలో రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణలు చేపడుతుంది. కొన్ని సంవత్సరాలుగా యూనివర్సిటీల్లో పోస్టుగ్రాడ్యుయేషన్, పీహెచ్డీ అడ్మిషన్ల విధానంలో అనేక లోటుపాట్లు నెలకొన్నాయని ఉన్నత విద్యాశాఖ ఉన్నతాధికారులు భావించారు. ఫలితంగా మెరిట్ విద్యార్థులకు అడ్మిషన్లు లభించడం లేదన్న విషయం సర్కార్ దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో తొలుత పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) అడ్మిషన్ల విధానంలో సంస్కరణలు తీసుకువచ్చే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. అందుకోసం ఓయూ వీసీ ప్రొఫెసర్ రామచంద్రం, జేఎన్టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ వేణుగోపాల్రెడ్డి, బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ సీతారామారావులతో కమిటీ వేశారు. మరోవైపు అన్ని యూనివర్సిటీల్లో విస్తృత స్థాయిలో పరిశోధనలు చేపట్టాలన్న అంశంపైనా ప్రభుత్వం దృష్టి సారించింది.
పీహెచ్డీ అడ్మిషన్ల విధానంలోనూ సంస్కరణలు తీసుకువస్తున్నారు. ఈ అంశాన్ని కూడా ముగ్గురు వీసీలతో ఏర్పాటు చేసిన కమిటీలో చర్చించనున్నారు. అన్ని యూనివర్సిటీల్లో పరిశ్రమలు, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కోర్సులను రీ డిజైనింగ్ చేయడానికి నడుం బిగించారు. దీనిపై కూడా త్వరలోనే మరో ఇద్దరు వీసీలతో మరో కమిటీ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ చర్యలు చేపట్టింది. వర్సిటీల్లో భవన నిర్మాణాలు, వాటి మరమ్మతులు, కనీస వసతి సదుపాయాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడానికి సర్కారు సానుకూలంగా ఉన్నది. దీంతో వర్సిటీల్లో నాణ్యమైన విద్యావిధానంపై దృష్టి పెట్టాలని అధికారులు భావిస్తున్నారు.