యాప్నగరం

TS: అధిక ఫీజులు.. ఆన్‌లైన్‌ క్లాసులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

స్కూళ్లు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్న నేపథ్యంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Samayam Telugu 6 Aug 2020, 6:58 pm
కరోనా కారణంగా స్కూళ్లు మూతబడటంతో ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్న నేపథ్యంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆన్‌లైన్‌ క్లాసులు పిల్లలపై మానసిక, శారీరక ప్రభావం చూపుతాయని అభిప్రాయం వ్యక్తం చేసింది. కొన్ని కార్పొరేట్ పాఠశాలలు గంటల తరబడి ఆన్ లైన్ పాఠాలు చెబుతున్నాయని.. ఐదో తరగతి లోపు పిల్లలు అంతసేపు ఆన్‌లైన్‌‌లో ఎలా ఉండగలరని ప్రశ్నించింది.
Samayam Telugu ఆన్‌లైన్‌ క్లాసులు


ఆన్‌లైన్‌ తరగతులు నిషేధించాలని హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ వేసిన పిల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా విద్యాసంవత్సర విధివిధానాలపై ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం రాష్ట్ర విద్యా శాఖ పరిధిలోని పాఠశాలలకే వర్తిస్తుందా అని హైకోర్టు ప్రశ్నించింది.

ఆన్‌లైన్‌ తరగతులు, విధివిధానాలు ఇప్పటికే రూపకల్పన చేశామని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ప్రైవేట్ పాఠశాలలు పాటించాల్సిన నిబంధనలు కూడా ప్రకటిస్తామని పేర్కొంది.

ఇక అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై కూడా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫీజులు వసూలు చేయ వద్దన్న జీవోను పాఠాశాలులు ఉల్లంఘిస్తున్నాయన్న పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అధిక ఫీజులు వసూలు చేస్తే తిరిగి ఇప్పించే అధికారం తమకుందని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

Also read: ప్రభుత్వం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి కాలేజీలు ప్రారంభం

Also read: ECIL HYDERABAD 25 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. రాత పరీక్ష లేదు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.