ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై దాఖలైన పిటిషన్పై బుధవారం (మే 15) హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా.. ఇంటర్ పరీక్షల్లో తప్పిన అభ్యర్థులందరి ఫలితాలు, మార్కుల జాబితాలతోపాటు జవాబు పత్రాలను కూడా మే 27న సాయంత్రం 5 గంటలలోగా ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలంటూ.. ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. దీనివల్ల గతంలో వచ్చిన మార్కులు, రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ తరువాత మార్కులతోపాటు జవాబు పత్రాలను విద్యార్థులు సరిచూసుకుంటారని కోర్డు పేర్కొంది. విచారణలో భాగంగా మొదట వాదనలు వినిపించిన ప్రభుత్వ తరఫు న్యాయవాది.. ఇంటర్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ప్రక్రియ పూర్తిచేశామని, ఫలితాలను మే 16న విడుదల చేయనున్నట్లు కోర్టుకు తెలిపారు. అదేవిధంగా మే 27 నుంచి విద్యార్థుల సమాధాన పత్రాలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నట్లు బోర్డు కోర్టుకు విన్నవించింది. అయితే ఇంటర్బోర్డు వాదనతో విభేదించిన హైకోర్టు ఫలితాలను 16న విడుదల చేయవద్దని.. ఫలితాలు, సమాధాన పత్రాలను ఒకేసారి ప్రకటించాలని ఆదేశించింది. ఈ మేరకు మే 27న ఫలితాలు ప్రకటించి, సమాధాన పత్రాలను కూడా అదేరోజు ఆన్లైన్లో ఉంచాలని ఆదేశించింది.
గ్లోబరీనాకు నోటిసులు...
అదే విధంగా ఫలితాల్లో గందరగోళానికి కారణమైన గ్లోబరీనా టెక్నాలజీస్ లిమిటెడ్ను ప్రతివాదిగా చేర్చాలంటూ దాఖలైన ఇంప్లీడ్ పిటిషన్ను హైకోర్టు అనుమతించింది. ఈ సందర్భంగా గ్లోబరీనాకు నోటీసులు జారీ చేస్తూ.. తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసింది.
ఇంటర్ పరీక్షలకు మొత్తం 9,43,005 మంది పరీక్షలకు హాజరుకాగా 5,60,889 మంది ఉత్తీర్ణులు కాగా.. 3,82,116 మంది ఫెయిలయ్యారు. వీరికి మే చివరి వారం నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 25 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు ప్రకటించింది. అయితే మే 26, 27 తేదీల్లో బిట్శాట్, జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు ఉన్న నేపథ్యంలో సప్లిమెంటరీ పరీక్షలు మే 28 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీనిపై ఇంటర్ బోర్డు ఇప్పటికివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
గ్లోబరీనాకు నోటిసులు...
అదే విధంగా ఫలితాల్లో గందరగోళానికి కారణమైన గ్లోబరీనా టెక్నాలజీస్ లిమిటెడ్ను ప్రతివాదిగా చేర్చాలంటూ దాఖలైన ఇంప్లీడ్ పిటిషన్ను హైకోర్టు అనుమతించింది. ఈ సందర్భంగా గ్లోబరీనాకు నోటీసులు జారీ చేస్తూ.. తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసింది.
ఇంటర్ పరీక్షలకు మొత్తం 9,43,005 మంది పరీక్షలకు హాజరుకాగా 5,60,889 మంది ఉత్తీర్ణులు కాగా.. 3,82,116 మంది ఫెయిలయ్యారు. వీరికి మే చివరి వారం నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 25 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు ప్రకటించింది. అయితే మే 26, 27 తేదీల్లో బిట్శాట్, జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు ఉన్న నేపథ్యంలో సప్లిమెంటరీ పరీక్షలు మే 28 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీనిపై ఇంటర్ బోర్డు ఇప్పటికివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.