యాప్నగరం

TS Inter Recounting 2019: ఇంటర్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ గడువు పెంపు

నిరసనలు హోరెత్తుతున్న నేపథ్యంలో తెలంగాణ ఇంటర్ బోర్డు దిగొచ్చింది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ తేదీల గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

Samayam Telugu 23 Apr 2019, 5:19 pm
ఇంటర్‌ ఫలితాల్లో నెలకొన్న గందరగోళం, నిరసనల హోరు నేపథ్యంలో తెలంగాణ ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రీ-కౌంటింగ్‌, రీ-వెరిఫికేషన్‌ దరఖాస్తు గడువును పొడిగించుకుంది. ఏప్రిల్ 27 వరకు దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పించింది. దీంతో పాటు సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించడానికి సంబంధించిన గడువును కూడా పొడిగించినట్లు అధికారులు తెలిపారు. ఇంటర్ విద్యార్థులు, తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
Samayam Telugu innter
ఇంటర్ బోర్డు


ఇంతకుముందు ఈ గడువు ఏప్రిల్ 25 వరకు ఉండగా.. అదనంగా మరో రెండు రోజులు అవకాశం కల్పించారు. ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌తో పాటు టీఎస్‌ ఆన్‌లైన్‌ సేవా కేంద్రాల్లో ఫీజు చెల్లించడానికి ఏర్పాట్లు చేసినట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్‌.. మంగళవారం (ఏప్రిల్ 23) వెల్లడించారు.

విద్యార్థులు రీకౌంటింగ్ కోసం ఒక్కో పేపరుకు రూ.100, రీవెరిఫికేషన్ కోసం ఒక్కో పేపరుకు రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు పరీక్షలో పాసైన మొదటి సంవత్సరం విద్యార్థులు ఇంప్రూమ్‌మెంట్ కోసం ఒక్కో పేపరుకు రూ.150 చెల్లించాలి.

ఫలితాల్లో నెలకొన్న గందరగోళం నేపథ్యంలో అధిక సంఖ్యలో విద్యార్థులు రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో దరఖాస్తు, ఫీజు చెల్లింపులో అనేక సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. తీవ్ర గందరగోళానికి కారణమవుతోంది.

మరోవైపు.. ఇంటర్‌ ఫలితాల్లో నెలకొన్న గందరగోళంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో సమావేశమైంది. అటు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.