యాప్నగరం

తెలంగాణలో ఏప్రిల్‌ నెలాఖరులో ఇంటర్‌ వార్షిక పరీక్షలు..? తర్వాత టెన్త్‌ పరీక్షలు కూడా..!

TS Inter Exams 2022: తెలంగాణలో ఏప్రిల్‌ నెలాఖరు నుంచి మే నెల మధ్యలో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలను నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకెళ్తే..

Samayam Telugu 31 Dec 2021, 3:59 pm
తెలంగాణలో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల నిర్వహణపై అధికారులు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఏప్రిల్‌ నెలాఖరు నుంచి మే నెల మధ్యలో ఈ పరీక్షలను నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఫీజుల షెడ్యూల్‌ను ఒకటి రెండు రోజుల్లో జారీ చేసే అవకాశాలున్నాయి.
Samayam Telugu టీఎస్‌ ఇంటర్‌ ఎగ్జామ్స్‌ 2022


ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసిన వెంటనే పదో తరగతి పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ ను కూడా విడుదల చేయనున్నారు. ఒకవేళ మే 15వ తేదీకి గనుక ఇంటర్‌ పరీక్షలు పూర్తయితే.. మే నెలాఖరు లేదా, జూన్‌ మొదటి వారంలో పదో తరగతి వార్షిక పరీక్షలను నిర్వహించే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల జాతర.. రెవెన్యూశాఖలో 670 ఉద్యోగాలు.. APPSC నోటిఫికేషన్‌ విడుదల
అయితే.. ఈ ఏడాది అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం ఇంటర్మీడియట్‌ పరీక్షలను మార్చి 23 నుంచి నిర్వహించాల్సి ఉంది. అయితే కరోనాతో ప్రత్యక్ష క్లాసుల ప్రారంభం కొంత ఆలస్యం కావడంతో పాటు, మధ్యలో ఇంటర్‌ మొదటి ఏడాది పరీక్షలను నిర్వహించడంతో కొన్ని రోజుల పాటు బోధనకు అటంకం ఏర్పడిన విషయం తెలిసిందే.

ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని వార్షిక పరీక్షలను అనుకున్న దానికంటే.. కొద్ది రోజులు ఆసల్యంగా ప్రారంభించే అవకాశాలున్నాయి. అలాగే.. ఈ ఏడాది ప్రత్యక్ష తరగతుల ప్రారంభం ఆలస్యమైన విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఇంటర్‌తో పాటు టెన్త్‌లో కూడా 70 శాతం సిలబ్‌సను అమలు చేస్తున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం ఇప్పటికే అధికారికంగా నిర్ణయం తీసుకున్న విషయం విధితమే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.