యాప్నగరం

TS: ఇంటర్‌ సిలబస్ 30 శాతం ‌తగ్గింపు..!

సీబీఎస్ఈ సిలబస్‌ను కుదించినట్లుగానే ఇంటర్‌ బోర్డు కూడా ఆలోచనలు చేస్తోంది.

Samayam Telugu 10 Jul 2020, 11:12 am
తెలంగాణలోనూ ఇంటర్మీడియట్ సిలబస్‌ను కుదించేందుకు రాష్ట్ర ఇంటర్ బోర్డు కసరత్తు ప్రారంభించింది. సీబీఎస్ఈ 9 నుంచి 12వ తరగతి వరకు 30 శాతం సిలబస్‌ను కుదించినట్లుగానే రాష్ట్రంలోనూ ఆ మేరకు చర్యలు చేపట్టాలని నిర్ణయించింది.
Samayam Telugu ఇంటర్‌ బోర్డు


ఎంపీసీ, బైపీసీ గ్రూపులకు సంబంధించిన సిలబస్ సీబీఎస్ఈలో, రాష్ట్రంలో ఒకే మాదిరిగా ఉంటుంది కాబట్టి ఆయా గ్రూపుల్లో సీబీఎస్ఈ తొలగించే పాఠ్యాంశాలను రాష్ట్రంలోనూ తొలగించాలని ఇంటర్ బోర్డు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ వంటి సబ్జెక్టుల్లో సీబీఎస్‌ఈ ప్రకారమే తొలగింపును అమలు చేయనుంది.

ఇక ఆర్ట్స్, భాషా సబ్జెక్టులు మాత్రం రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగానే చాలా వరకు ఉంటాయి కాబట్టి స్థానికంగానే నిర్ణయం తీసుకోనుంది. భాషా, ఆర్ట్స్‌ సబ్జెక్టుల్లో సీబీఎస్‌ఈ తొలగించే పాఠ్యాంశాలు ఉంటే వాటిని తొలగించడంతోపాటు స్థానిక అంశాలకు సంబంధించిన సిలబస్‌ను కుదించాలని భావిస్తోంది.

Also read: వాళ్లందరికీ ఎంసెట్‌ దరఖాస్తు ఫీజు రూ.10వేలు

Also read: ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం.. అందరూ కంపార్ట్‌మెంటల్‌లో పాస్‌

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.